రివేంజ్ పాలిటిక్స్ : టార్గెట్ సాధ్వీ.. మర్డర్ కేసు రీ ఓపెన్..
భోపాల్ : సార్వత్రిక ఎన్నికలు పూర్తవడంతో ప్రత్యర్థి పార్టీలు రివేంజ్ పాలిటిక్స్కు రెడీ అవుతున్నాయి. మధ్యప్రదేశ్లో ఒకవైపు కమల్నాథ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు అక్కడి ప్రభుత్వం సాధ్వీ ప్రగ్యా ఠాకూర్పై ఉన్న కేసుల్ని తిరగదోడే పనిలో పడింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ జోషి మర్డర్ కేసును రీ ఓపెన్ చేయాలని కమల్నాథ్ సర్కారు నిర్ణయించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ములాయం, అఖిలేశ్కు రిలీఫ్ : వ్యతిరేకంగా సాక్ష్యం లేదన్న సీబీఐ
సునీల్ జోషి హత్య కేసు పునర్విచారణకు సంబంధించి కమల్నాథ్ ప్రభుత్వం న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. అనంతరం పై కోర్టులో కేసు రీ ఓపెన్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పింది. హత్య జరిగిన సమయంలో కలెక్టర్ న్యాయ సలహా తీసుకోకుండా ఏకపక్షంగా కేసును మూసివేశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి దేవాస్ కలెక్టర్ను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెబుతున్నాయి
సాధ్వీపై హత్య కేసు తిరగదోడటంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. దిగ్విజయ్కు ప్రత్యర్థిగా బరిలో దిగినందునే సాధ్వీని టార్గెట్ చేశారని విమర్శించింది.