Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జిగ్నేష్ మేవానీకి అరుంధతీ రాయ్ భారీ విరాళం

న్యూఢిల్లీ: తాను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని దళిత నేత జిగ్నేష్ మేవానీ ప్రకటించిన మరుసటి రోజు నుంచి అతనికి భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. వెబ్‌సైట్ ద్వారా ఆయన నిధుల సేకరణ చేపడుతున్నారు.

రూ. 100 నుంచి లక్షల వరకు మేవానీకి విరాళాలు వస్తుండటం గమనార్హం. గత పదిరోజుల్లోనే ఆయన రూ.9లక్షల మేర విరాళాలు సేకరించారు. రచయిత అరుంధతీ రాయ్ కూడా రూ. 3లక్షలను మేవానీ నిధికి విరాళంగా ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో మేవానీ.. అరుంధతీ రాయ్‌కి ఫేస్‌బుక్ పోస్టు ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

Arundhati Roy Contributes Rs 3 Lakh to Dalit Leader Jignesh Mevani's Campaign

తాను కుల వివక్షపై పోరాటం చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తనకు తోచినంత విరాళం అందజేయాలని మేవానీ ప్రజలను కోరారు. సమాజ హితం కోసమే ఈ డబ్బును ఉపయోగిస్తానని మేవానీ చెప్పారు. కాగా, మేవానీపై తాము అభ్యర్థిని నిలబెట్టబోమని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. వేదగామ్ నుంచి మేవానీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

నామినేషన్ వేసిన మరుసటి రోజే నాన్ బెయిలబుల్ వారెంట్

నామినేషన్‌ దఖాలు చేసే పనిలో బిజీగా ఉన్నందున జిగ్నేశ్‌ రాలేకపోయారని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది షంషాద్ పఠాన్‌ విన్నవించారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. వైబ్రెంట్‌ గుజరాత్‌ సదస్సుకు వ్యతిరేకంగా జనవరి 11న నిర్వహించిన రైల్‌ రోకో ఆందోళనలో భాగంగా అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను జిగ్నేశ్‌, ఆయన మద్దతుదారులు నిలిపివేశారు. ఈ కేసులో 40 మంది కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+