ఫలితాల రోజు టీవీ చూడని మోడీ: కేజ్రీవాల్ ఓ చిన్న నేత, గోద్రాపై మౌనం
ఢిల్లీ: లోకసభ ఎన్నికల ఫలితాల రోజు తాను టీవీ చూడలేదని, ఒక్కడినే ప్రశాంతంగా ఉన్నానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 2014 మే 16వ తేదీన లోకసభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ రోజు ఫలితాల కోసం యావత్ భారత దేశం ఉత్కంఠగా ఎదురు చూసింది. ఫలితాల రోజు అందరు టీవీ ముందు కూర్చున్నారు. మోడీ మాత్రం టీవీ చూడలేదు. మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాతే టెలిఫోన్ కాల్స్ను స్వీకరించారు.
ఆ తొలి ఫోన్ కాల్ నాటి బీజేపీ చీఫ్ రాజ్నాథ్ సింగ్ చేశారు. ఎన్నికల్లో పార్టీ గెలిచిందని ఆయన తెలిపారు. దీనిని ప్రధాని మోడీ స్వయంగా వెల్లడించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మాజీ మీడియా సలహాదారు లాన్స్ ప్రైస్ రచించిన 'ది మోడీ ఎఫెక్ట్: ఇన్ సైడ్ నరేంద్ర మోడీస్ క్యాంపెయిన్ టు ట్రాన్స్ఫామ్ ఇండియా' పుస్తకంలో మోడీ గురించి, ఆయన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలున్నాయి.

ఈ పుస్తకాన్ని భారత్లో హాచెట్ సంస్థ ప్రచురించింది. ప్రధానితో పాటు పీయూష్ గోయల్ తదితర ఆయన కేబినెట్ సహచరులు, సలహాదారులు, విశ్లేషకుల బృందంతో ఇంటర్వ్యూలతో దీనిని రచించారు. ఈ పుస్తకం ప్రకారం... 2012 గుజరాత్ ఎన్నికల్లో తన గెలుపు నాటి నుండే పార్టీ ప్రధాని అభ్యర్థుల్లో తనను ఒకరిగా పరిగణిస్తారన్న విషయమై తనకు స్పష్టత ఉందని మోడీ పేర్కొన్నారు.
కానీ తాను ఎప్పుడు వాస్తవంగా దాని గురించి ఆలోచించలేదని, తనను ప్రధాని అభ్యర్థఇగా నామినేట్ చేసేలా పార్టీలో లాబీయింగ్ చేయడానికి ప్రయత్నించలేదని చెప్పారు. అసలు తనను లేదా మరొకరిని నామినేట్ చేస్తారా అన్న అంశంపై తనకు ఆసక్తి లేదన్నారు. ఎన్నికలకు ముందు మీడియాకు అందుబాటులో ఉండరాదనుకున్నానని, మీడియా ఆసక్తిని పొందాలనుకున్నానని చెప్పారు.
కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రయివేట్ విమానాన్ని తాము వినియోగిస్తున్నామని మీడియా రాసిందని, కానీ దానికి పార్టీ డబ్బులు చెల్లించిందని, మరో విషయమేమంటే ప్రచారాన్ని నడిపించేందుకు అవసరమైతే తాను సైకిళ్లు కూడా అద్దెకు తీసుకుంటానని చెప్పారు. వారణాసిలో కేజ్రీవాల్ తన పైన పోటీ చేసినప్పుడు తానసలు పట్టించుకోలేదని, ఆయన చిన్న నేత అన్నారు. ఆయన చిన్న నగర లీడర్ అన్నారు.
చాలామంది ప్రతిపక్ష నాయకులతో పోలీస్తే కావాలనే కొందరు ఆయనకు విపరీతమైన ప్రచారం కల్పించారన్నారు. కేజ్రీవాల్ గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోవాలని తాను అనుకోలేదని చెప్పారు. తాను ప్రధాని అనే భావన నేటికీ తనకు కలగలేదని జూలైలో చెప్పారు. పలు అంశాల గురించి ప్రస్తావించిన ప్రధాని మోడీ... గోద్రా అల్లర్ల పైన మాట్లాడేందుకు మాత్రం నిరాకరించారట.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications