పరువునష్టం: తగ్గని కేజ్రివాల్పై అభియోగాలు నమోదు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పెట్టిన పరువునష్టం కేసులో శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్పై అభియోగాలు నమోదయ్యాయి. 499, 500 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసిన న్యాయస్థానం, వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది.
ఆగస్టు 2 నుంచి ఈ కేసును విచారించనుంది. కేజ్రివాల్పై న్యాయస్థానం నమోదు చేసిన అభియోగాలు రుజువైతే.. అతనికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతకుముందు న్యాయస్థానం అరవింద్ కేజ్రివాల్కు ఓ సూచన చేసింది.

ఇద్దరూ రాజకీయ నాయకులు కాబట్టి పరస్పరం చర్చించుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇద్దరు నేతలు తమ విలువైన సమయాన్ని మరింత ఉపయోగకరమైన విధంగా వినియోగించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొంది. అయితే అరవింద్ కేజ్రివాల్ మాత్రం అందుకు అంగీకరించలేదు.
తాను చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోనని తేల్చి చెప్పాడు. దీంతో కేజ్రివాల్పై అభియోగాలు నమోదు చేసింది. కాగా, అరవింద్ కేజ్రివాల్ తనకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదనీ.. తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుంటే చాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
ఇది ఇలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణపై సుప్రీం కోర్టు స్టేను పొడిగించింది. జయలలిత కేసు విచారణపై స్టేను జూన్ 16 వరకు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications