కాంగోలో మారణహోమం: ఉగ్ర దాడుల్లో 39 మంది బలి -కరోనాకు 32 మంది ఎంపీలు మృతి
అటు కరోనా, ఇటు ఉగ్రవాదుల మారణహోం ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను అల్లాడిస్తున్నాయి. దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడటంతో దాదాపు 39 మంది మరణించినట్లు సమాచారం.
కాంగో తూర్పు చివరన ఉన్న బోగా, తచాబీ గ్రామాల్లో రెడు వేర్వేరుచోట్ల జరిగిన ఈ ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులకు ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థగా కాంగో ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. అనూహ్యరీతిలో శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలపై ఈ దాడి జరిగిందని ఒక వార్తా సంస్థ ధ్రువీకరించింది.

ఉగ్ర దాడుల్లో మరణించిన మొత్తం 39 మందిలో ఇప్పటివరకు 36 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం. ఉత్తర కివు ప్రావిన్స్-ఇటురి మధ్య సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్నదని, రెండు ప్రాంతాలలో ఎప్పుడూ ఉద్రిక్తతలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
కాంగో తూర్పు చివరను ఆక్రమించిన 122 మంది ఉగ్రవాదుల ఏడీఎఫ్ చాలా ఘోరమైన సమూహంగా అంచనా వేయబడింది. వాస్తవానికి, ఈ ప్రాంతం ఖనిజాలతో నిండి ఉన్నది. ఈ కారణంగా ఈ స్థలం గురించి అనేక వివాదాలు ఉన్నాయి. 1996-2003 మధ్య రెండు ప్రాంతీయ యుద్ధాలు కూడా జరిగాయి. ఉత్తర కివులోని బెని ప్రాంతంలో 2019 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 1228 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఎన్జీఓ కేఎస్టీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే
కాంగోలో వైద్య సౌకర్యాల లేమి కారణంగా కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్నది. దేశ పార్లమెంటు సభ్యుల్లో 32 మంది కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు కరోనా, మరోవైపు ఉగ్రవాదం చేతిలో నలుగుతూ కాంగో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications