కాంగోలో మారణహోమం: ఉగ్ర దాడుల్లో 39 మంది బలి -కరోనాకు 32 మంది ఎంపీలు మృతి
అటు కరోనా, ఇటు ఉగ్రవాదుల మారణహోం ఆఫ్రికా దేశమైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను అల్లాడిస్తున్నాయి. దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడటంతో దాదాపు 39 మంది మరణించినట్లు సమాచారం.
కాంగో తూర్పు చివరన ఉన్న బోగా, తచాబీ గ్రామాల్లో రెడు వేర్వేరుచోట్ల జరిగిన ఈ ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులకు ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థగా కాంగో ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. అనూహ్యరీతిలో శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలపై ఈ దాడి జరిగిందని ఒక వార్తా సంస్థ ధ్రువీకరించింది.
ఉగ్ర దాడుల్లో మరణించిన మొత్తం 39 మందిలో ఇప్పటివరకు 36 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం. ఉత్తర కివు ప్రావిన్స్-ఇటురి మధ్య సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్నదని, రెండు ప్రాంతాలలో ఎప్పుడూ ఉద్రిక్తతలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
జగన్కు భారీ షాక్: ఢిల్లీలో రఘురామ ఫిర్యాదుల పర్వం -ఎన్హెచ్ఆర్సీసీ పంత్తో భేటీ -నిర్వచనం మారితే?
కాంగో తూర్పు చివరను ఆక్రమించిన 122 మంది ఉగ్రవాదుల ఏడీఎఫ్ చాలా ఘోరమైన సమూహంగా అంచనా వేయబడింది. వాస్తవానికి, ఈ ప్రాంతం ఖనిజాలతో నిండి ఉన్నది. ఈ కారణంగా ఈ స్థలం గురించి అనేక వివాదాలు ఉన్నాయి. 1996-2003 మధ్య రెండు ప్రాంతీయ యుద్ధాలు కూడా జరిగాయి. ఉత్తర కివులోని బెని ప్రాంతంలో 2019 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 1228 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఎన్జీఓ కేఎస్టీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే
కాంగోలో వైద్య సౌకర్యాల లేమి కారణంగా కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్నది. దేశ పార్లమెంటు సభ్యుల్లో 32 మంది కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు కరోనా, మరోవైపు ఉగ్రవాదం చేతిలో నలుగుతూ కాంగో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు.