అటల్ బిహారీ వాజపేయి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎయిమ్స్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్య పరిస్థితిపై ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం వాజపేయి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మరో రెండ్రోజులపాటు ఆస్పత్రిలోనే ఆయనకు వైద్య చికిత్స అందించనున్నట్లు చెప్పారు. ఆయన మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

వాజపేయి తాము అందిస్తున్న చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు. ఆయన ఇన్ఫెక్షన్ తగ్గేవరకు ఆస్పత్రిలోనే ఉంచుతామని చెప్పారు. కాగా, అనారోగ్యం కారణంగా వాజపేయి గత కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు.
Kanpur: BJP workers conducted 'havan' for former PM #AtalBihariVajpayee who is admitted in AIIMS (All India Institutes of Medical Sciences) Delhi. He is undergoing treatment for urinary tract infection at the hospital. pic.twitter.com/o56jwABlbk
— ANI UP (@ANINewsUP) June 12, 2018
ఇది ఇలా ఉండగా, వాజపేయి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు. సోమవారం ఆస్పత్రిలో చేర్చడంతో వాజపేయిని ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నేత ఎల్కే అద్వానీ, పలువరు కేంద్రమంత్రులు, రాహుల్ గాంధీ ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications