దొంగల బీభత్సం: ఏకంగా ఏటిఎంనే ఎత్తుకెళ్లారు
పఠాన్కోట్: దోపీడీ చేసేందుకు వచ్చిన దొంగలు ఏకంగా ఏటిఎంనే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పఠాన్కోట్లోని సర్ణ ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల ఏటీఎంలో దొంగతనానికి వచ్చిన దుండగులు ఏకంగా ఆ ఏటీఎంనే ఎత్తుకెళ్లారు.
చోరీ జరిగిన సమయంలో ఏటీఎంలో రూ.3,70,700 నగదు ఉన్నట్లు బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఏటీఎం వద్ద సెక్యురిటీ గార్డు లేకపోవడం వల్లే చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు.

ఏటీఎంను చోరీ చేయడానికి ముందు దొంగలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీని ధ్వంసం చేశారని, వాటిపై బ్లాక్ స్ప్రే చల్లారని పోలీసులు తెలిపారు.
బ్యాంకు మేనేజర్ దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసును పఠాన్కోట్ సీనియర్ ఎస్పీ రాకేష్ కౌశల్ పర్యవేక్షిస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications