పాక్ బోర్డర్: అనుమానాస్పద వస్తువు కూల్చివేత
జైపూర్/ఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా గాలిలో ఎగురుతున్న ఒక గుండ్రని ఆకృతి(బెలూన్ లాంటి) వస్తువును భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం మంగళవారం కూల్చివేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్కు సుమారు 500 కి.మీల దూరంలోని బార్మర్ జిల్లా సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది.
భారత వైమానిక దళ అధికార వర్గాల సమాచారం ప్రకారం.. భారతదేశమంతా గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న సమయంలో ఉదయం 10.30 - 11 గంటల ప్రాంతంలో పాక్ వైపునకు ఉన్న పశ్చిమ సెక్టార్ నుంచి ఒక గుర్తుతెలియని బంతి ఆకారంలో ఉన్న వస్తువును ఐఏఎఫ్ రాడార్ గుర్తించడంతో దాన్ని కూల్చివేశారు.

ఈ విషయమై ఐఏఎఫ్ దర్యాప్తు జరుపుతోంది. అంతకు ముందు బార్మర్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఆకాశం నుంచి లోహపు తునకలు పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు.
దీంతో అదనపు ఎస్పీ జస్సారాం బోస్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఆ ప్రాంతానికి వెళ్లి త్రికోణాకారంలో ఉన్న 5 తునకలను పరిశీలించింది. అయితే అవి పేలుడు పదార్థాలు కావని నిర్ధారణకు వచ్చింది. ఆ తునకలను ఐఏఎఫ్కు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.
-
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications