బ్యాంకులకు రూ. 7 వేల కోట్లు కుచ్చుటోపి, 169 చోట్ల సీబీఐ సోదాలు, 37 కేసులు, కథ క్లోజ్ !
న్యూఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన వారి మీద సీబీఐ అధికారులు ఉక్కుపాదం మోపారు. దేశ వ్యాప్తంగా రూ. 7,000 కోట్ల ఫ్రాండ్ కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మంగళవారం 169 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది !
ఆల్ ఇండియా
దేశ వ్యాప్తంగా అనేక మంది బ్యాంకులకు రూ. 7, 000 కోట్లకు పైగా మోసం చేశారని సీబీఐ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చండీగడ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దాద్రా, నగర్ హవేలి, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు.
నెల క్రితం సీబీఐ రుచి
ఇటీవల కాలంలో బ్యాంకులకు మోసం చేశారని ఆరోపిస్తూ అధికారులు సోదాలు చేశారు. నెల క్రితం ఇదే విషయంపై అధికారులు దాడులు చేసి అనేక విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎంత మొత్తంలో అధికారులు విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అనే విషయం చెప్పలేదు.
37 చీటింగ్ కేసులు
మంగళవారం దేశ వ్యాప్తంగా సీబీఐ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ విషయంపై ఓ సీబీఐ అధికారి మాట్లాడుతూ బ్యాంకులకు రూ. 7, 000 కోట్ల మోసం చేశారని 37 చీటింగ్ కేసులు నమోదైనాయని, అందుకే దాడులు చేస్తున్నామని వివరించారు.
21 వేల బినామీ బ్యాంకు అకౌంట్లు
ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంసీ బ్యాంకు చీటింగ్ కేసుకు సంబంధించి సుమారు 21,000 బినామీ బ్యాంకు అకౌంట్లు వెలుగు చూశాయి. సుమారు రూ. 4,300 కోట్లు రుణాలు ఇచ్చిన బ్యాంకును దివాల స్థితికి తీసుకు వచ్చారని వెలుగు చూసింది. ఈ కేసులో రాకేష్ నారంగ్ వాధవన్, పీఎంసీ ఎండీ జాయ్ థామస్, చైర్మన్ వయ్రాం సింగ్, డైరెక్టర్ ఎస్ఎస్. అరోరాలను ముంబై నేర విభాగం పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.