Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహుల్ కు షాక్ ఇచ్చిన కోర్టు, క్యూలో సీఎం, డీసీఎం, అందరూ కోర్టుకు రండి, సమన్లు జారీ !

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంలో ఉచిత హామీ పథకం ప్రభావం ఎంత ఉందో, బీజేపీపై 40% కమిషన్ ఆరోపణ కూడా అంతే ప్రభావం చూపింది. నాటి బీజేపీ ప్రభుత్వం 40% కమీషన్ పొంది అన్ని కాంట్రాక్టు పనులు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇదే ఆరోపణ రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లకు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు రెండు వ్యూహాలు రచించారు. ఈ వ్యూహాలలో ఒకటి ఉచిత హామీల పథకాలను హైప్ చేయడం, మరోవైపు అప్పటి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్లడం అని ప్లాన్ చేశారు. దీని ద్వారా కర్ణాటక ఓటర్ల దృష్టిని కూడా కాంగ్రెస్ నేతలు ఆకర్షించి వారి మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు ఇదే ప్లాన్ కాంగ్రెస్ నేతలకు పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మరోసారి చిక్కు వచ్చి పడింది.

Bengaluru court issued summons to Rahul Gandhi, Siddaramaiah and DK Shivakumar

రాహుల్ గాంధీకి ఎదురైన సమస్యలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిత్తరపోయారు. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ నేతలు 40% కమీషన్ వసూలు చేశారని ఆరోపణలు చెయ్యడంతో బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీని ద్వారా కాంగ్రెస్ నేతలపై న్యాయపరమైన యుద్ధం ప్రకటించారు. ఈ యుద్దం ఇప్పుడు ఫలించి కాంగ్రెస్ నేతలకు పెద్ద చిక్కు వచ్చిపడింది. దీంతో పాటు రాహుల్ గాంధీకి కూడా పెద్ద చిక్కు వచ్చి పడింది.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులకు కోర్టు షాక్ ఇచ్చింది. కర్ణాటకలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్‌ లసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు సంబంధించి బెంగళూరు కోర్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి సమన్లు ​​జారీ చేసింది. దీంతో పాటు వ్యక్తిగతంగా హాజరు కావాలని ముగ్గురు నాయకులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్‌ ఎదురైయ్యింది.

40% కమీషన్ ఆరోపిస్తూ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ విజయం సాధించింది. అదే సమయంలో పే సీఎం (Pay CM) పోస్టర్ వివాదం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి వ్యతిరేకంగా 'పే సీఎం' పోస్టర్లు కూడా వేశారు. ఇది చాలదన్నట్లు కాంగ్రెస్ నేతలు అప్పటి బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కర్ణాటకలోని ప్రధాన వార్తాపత్రికల ద్వారా ప్రచారం చేసి అప్పటి బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో బసవరాజ్ బోమ్మయ్ అవినీతి రేటు కార్డును కూడా విడుదల చెయ్యడంతో అది వివాదానికి దారితీసింది.

Bengaluru court issued summons to Rahul Gandhi, Siddaramaiah and DK Shivakumar
ఈ విధంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలపై దుష్ప్రచారం చేశారని, ఆ ప్రచారం బీజేపీ పార్టీని కూడా దెబ్బతీసిందని, కాంగ్రెస్‌ నాయకుల మీద చర్యలు తీసుకోవాలని బీజేపీ కోర్టును ఆశ్రయించింది. బీజేపీ తరఫున న్యాయవాది వినోద్‌కుమార్‌ వాదించారు. ఈ పిటిషన్‌ను విచారించిన బెంగళూరులోని 42వ ఏసీఎంఎం కోర్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్‌లకు సమన్లు ​​జారీ చేసింది.

ఈ ముగ్గురూ మార్చి 28వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల ముందే రాహుల్ గాంధీ, సిద్దరామయ్య, డీకే శివకుమార్ లకు బెంగళూరు కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+