తుమకూరు వరకు బెంగళూరు మెట్రో రైలు పరుగులు
బెంగళూరు-తుమకూరు ప్రయాణికులకు శుభవార్త. నమ్మ మెట్రో.. ఇక పొరుగునే ఉన్న తుమకూరు వరకు వెళ్లనుంది. దీన్ని అక్కడి వరకు పొడిగించడానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ముసాయిదాకు ఆమోదం తెలిపింది. ఈ డీపీఆర్ వ్యయం 1.2 కోట్ల రూపాయలు. ఈ డీపీఆర్ ప్రకారం- బెంగళూరుకు సుమారు 70 కిలో మీటర్ల దూరంలో పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతున్న తుమకూరుకు మెట్రో రైలు సేవలను విస్తరించడం వల్ల ప్రతి గంటకు 15,000 మంది ప్రయాణికులకు సేవలు అందించగలదని అంచనా.
ఈ డీపీఆర్ తయారీ బాధ్యతలను హైదరాబాద్కు చెందిన ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్కు అప్పగించారు. అయిదు నెలల్లో నివేదిక సమర్పించాలని బీఎంఆర్సీఎల్ గడువు విధించింది. డీపీఆర్ తయారీ కోసం గత నెలలో టెండర్లను ఆహ్వానించింది. డీపీఆర్ ఖరారు అయ్యాక కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపిస్తారు. ఈ ప్రాజెక్ట్ కు అయ్యే ఖర్చును కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరించే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం తుమకూరు రూట్ లో మాదవార వరకు బెంగళూరు మెట్రో రైలు సర్వీసులు (గ్రీన్ లైన్) అందుబాటులో ఉన్నాయి. దీన్ని తుమకూరు వరకు పొడిగించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంది. మాదవార నుంచి నెలమంగళ, డబాస్ పేట, క్యాథసంద్ర మీదుగా తుమకూరు వరకు మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే అత్యంత రద్దీ మార్గాల్లో ఇదీ ఒకటి కావడం, పారిశ్రామిక కారిడార్ అయినందున మెట్రో సేవలను తుమకూరు వరకు పొడిగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. డీపీఆర్ రూపకల్పనకు టెండర్ల ప్రక్రియను సైతం పూర్తి చేసింది. దీంతో ఈ మెట్రో ప్రాజెక్ట్ కీలక దశలోకి ప్రవేశించినట్టయింది. తుమకూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నందున ఈ మెట్రో సేవలకు మంచి ఆదరణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి గంటకూ 15,000 మంది రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా వేసింది.
నమ్మ మెట్రో గ్రీన్ లైన్ సిల్క్ ఇన్స్టిట్యూట్ నుండి మాదవార వరకు 33.4 కిలో మీటర్ల మేర ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ రెండింటి మధ్య మొత్తం 31 స్టేషన్లు ఉన్నాయి. ప్రతిపాదిత విస్తరణ మాదవారలోని బెంగళూరు అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో ప్రారంభమై తుమకూరు వద్ద ముగుస్తుంది. ఈ కారిడార్లో 25 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయని ప్రణాళికలు రూపొందించారు.
2027 నాటికి మొత్తం 175 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ సేవలు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026 నాటికి మరో 41 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తాయి. 2027 డిసెంబర్ కల్లా ఎయిర్పోర్ట్ లైన్తో పాటు మరో 38 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలు పూర్తి కానున్నాయి. తావరెకెరె, హోసకోటె, బిడది, నెలమంగళలకు మెట్రో విస్తరణ ప్రణాళికలు తుదిదశల్లో ఉన్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications