బ్లాస్ట్కు ట్రయల్: దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో పురోగతి
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఉగ్రవాది అసదుల్లా అక్తర్ను విచారణ నిమిత్తం హైదరాబాద్కు తీసుకువచ్చిన జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అతని వద్ద నుంచి పేలుళ్లకు సంబంధించి సమాచారాన్ని సేకరించారు.
పేలుళ్లకు ముందు అబ్దుల్లాపూర్మెట్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉన్న ఉగ్రవాదులు, పేలుళ్లకు సైకిల్, కుక్కర్ సామాగ్రిని ఉపయోగించారు. వీటిని జుమ్మేరాత్ బజార్, మలక్పేట్లో కొనుగోలు చేసినట్లు విచారణలో ఉగ్రవాది అక్తర్ వెల్లడించారు. పేలుళ్లకు ముందు రోజు హయత్నగర్లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో బాంబు పేలుడు ట్రాయల్స్ చేశామని చెప్పాడు.

అందులో సక్సెస్ అయిన తర్వాతే బాంబు టైమింగ్ పెట్టినట్లు తెలిపాడు. పేలుడుకు ఉదయం పదకొండు గంటలకు బాంబులను సిద్ధం చేశామని, బాంబులను ఆటోలో దిల్సుఖ్నగర్కు తీసుకెళ్లినట్లు చెప్పాడు. పేలుళ్ల అనంతరం మంగళూరు, నేపాల్కు పారిపోయినట్లు విచారణలో ఉగ్రవాది అక్తర్ తెలిపాడు.
విడిభాగాలతో సైకిళ్లు తయారు చేసిన అనంతరం పేలుళ్ల రోజు మలక్పేట రైల్వే స్టేషన్లో సైకిళ్లు ఉంచి, ఆ సైకిళ్లకు టిఫిన్ బాక్సు బాంబులు అమర్చారు. దిల్సుఖ్ నగర్ 107 బస్టాప్ వద్ద ఓ సైకిల్, ఎ1 మిర్చి సెంటర్ వద్ద మరో సైకిల్ ఉంచారని వెల్లడించాడు. తమకు పేలుడు పదార్థాలు భత్కల్ ఇచ్చినట్లుగా చెప్పాడు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications