Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చరిత్ర సృష్టించిన మహిళలు! ఈసీ లెక్కల్లో దాగున్న 'ట్రంప్ కార్డు' ఇదే!

Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో ఒక్కటి మినహా మెజారిటీ సర్వేలు ఎన్డీఏ కూటమికి ఆధిక్యం లభిస్తుందని అంచనా వేశాయి. కేవలం ఒక్క ఎగ్జిట్ పోల్‌లో మాత్రమే మహాకూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని తేలింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మని వారు ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓ కీలక లెక్కపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ లెక్కలే ఎన్నికల్లో విజయాన్ని నిర్ధారించే ట్రిగ్గర్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది.

ఈసీ లెక్కల్లో దాగి ఉన్న కీలకాంశం
బీహార్ ఎన్నికల్లో మంగళవారం సాయంత్రం రెండో, తుది దశ పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కలు ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. బీహార్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల్లో 66.91 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో ఈ రికార్డు మరింత పెరిగి 68.76 శాతం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఈసీ స్త్రీ, పురుష ఓటర్ల పోలింగ్ శాతాన్ని విడిగా విడుదల చేసింది.మహిళా ఓటర్లు: 71.6 శాతం ఓటు వేయగా.. పురుష ఓటర్లు 62.8 శాతం మాత్రం ఓటు వేశారు. ఈ విధంగా పురుషుల కంటే మహిళలు ఏకంగా 8.8 శాతం ఎక్కువగా ఓటు వేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో మహిళలు ఓటు వేయడం ఇదే మొదటిసారి.

Bihar Election 2025 Women Voters Could Be the Trump Card in Deciding Results

ఎన్నికల ట్రిగ్గర్ పాయింట్ ఇదే!
ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ లెక్కల్లోనే బీహార్ ఎన్నికల తుది ఫలితాలను నిర్ణయించే 'ట్రిగ్గర్ పాయింట్' దాగి ఉంది. ఈ లెక్కల ప్రకారం, బీహార్‌లో పురుషుల కంటే దాదాపు 6 లక్షల మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. ఈ ఆరు లక్షల అదనపు ఓట్లను మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు విభజిస్తే, దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో సగటున 25 వేలకు పైగా మహిళా ఓట్లు అదనంగా పోలైనట్లు తెలుస్తోంది.2020 బీహార్ ఎన్నికల్లో 70 స్థానాలలో గెలుపు ఓటముల తేడా కేవలం 5,000 ఓట్ల కన్నా తక్కువగా ఉంది. ఈ లెక్కన ప్రతి సీటులో అదనంగా పడిన 25 వేల మహిళా ఓట్లు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపాయో.. వారికే విజయం దక్కడం ఖాయం.

మహిళల మొగ్గు ఎవరి వైపు?
ఈ భారీ సంఖ్యలో ఓటు వేసిన మహిళల మొగ్గు ఏ వైపు ఉందనే అంశమే ఎన్నికల ఫలితాలను నిర్ధారించనుంది. నితీష్ కుమార్ తన 20 ఏళ్ల పాలనలో మహిళల కోసం ప్రత్యేక ఓటు బ్యాంకును సృష్టించారు. 2005 నుంచి పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు, విద్యార్థినులకు సైకిల్ పథకాలు, ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు, జీవికా దీదీ పథకం వంటి అనేక కార్యక్రమాల ద్వారా మహిళలకు శక్తిని అందించారు. 2025 ఎన్నికలకు ముందు ఉపాధి ప్రారంభించేందుకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.10,000 ఆర్థిక సహాయం కూడా చేశారు. నితీష్ కుమార్ సహాయంతో విద్య పూర్తి చేసి, ఉద్యోగాలు పొందిన మహిళా ఓటర్లు ఆయనకు 'రిటర్న్ గిఫ్ట్' ఇచ్చి ఉండవచ్చు.

మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలు ఇచ్చారు (ప్రతి నెలా రూ.2500, మకర సంక్రాంతికి రూ.30,000 ఆర్థిక సహాయం వంటివి). అయినప్పటికీ, నితీష్ కుమార్ ర్యాలీలలో మహిళల రద్దీ స్పష్టంగా కనిపించింది. ఈ భారీ సంఖ్యలో పడిన మహిళా ఓట్లే బీహార్ ఎన్నికల ఫలితాలను నిర్ణయించే'ట్రంప్ కార్డు'గా మారే అవకాశం ఉంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+