వ్యతిరేకత ఉన్నా వసుంధర, శివరాజ్ నాయకత్వంలోనే ఎన్నికలు: రమణసింగ్పై సానుకూలత
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికలకు ముందు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో వరుసగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం ఖాయం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ల్లో నాయకత్వాన్ని మార్చకూడదని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది.
రాజస్థాన్లో ముఖ్యమంత్రి వసుంధర రాజే, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ల నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా వారే ముఖ్యమంత్రి అభ్యర్థులు కానున్నారు. వారిరువురిపై వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ గుర్తించింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి వారిద్దరినీ మార్చాలని ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు ఒత్తిడి తెచ్చారు.

కనీసం వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకుండా ఉండాలని కోరారు. అయినప్పటికీ మార్పులు చేయకూడదని నిర్ణయించింది. మరో వైపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్పై ఎలాంటి వ్యతిరేకతా లేకపోవడంతో ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లనుంది. ఈ మూడు రాష్ట్రాలకు ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరిగే అవకాశముంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications