వ్యతిరేకత ఉన్నా వసుంధర, శివరాజ్ నాయకత్వంలోనే ఎన్నికలు: రమణసింగ్పై సానుకూలత
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికలకు ముందు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో వరుసగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం ఖాయం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ల్లో నాయకత్వాన్ని మార్చకూడదని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది.
రాజస్థాన్లో ముఖ్యమంత్రి వసుంధర రాజే, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ల నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా వారే ముఖ్యమంత్రి అభ్యర్థులు కానున్నారు. వారిరువురిపై వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ గుర్తించింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి వారిద్దరినీ మార్చాలని ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు ఒత్తిడి తెచ్చారు.

కనీసం వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకుండా ఉండాలని కోరారు. అయినప్పటికీ మార్పులు చేయకూడదని నిర్ణయించింది. మరో వైపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్పై ఎలాంటి వ్యతిరేకతా లేకపోవడంతో ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లనుంది. ఈ మూడు రాష్ట్రాలకు ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరిగే అవకాశముంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications