అధికారంలోకి వారు వస్తే ఓవర్గానికి మేలు జరుగుతుంది: అమిత్ షా
ఉత్తర్ ప్రదేశ్: ఉత్తర్ ప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకుండా భారతదేశం అభివృద్ధి చెందడం సాధ్యం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని కాకోరిలో తిరంగా యాత్రను ప్రారంభించిన ఆయన పై విధంగా మాట్లాడారు.
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సామాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీలపై విమర్శలు గుప్పించారు. సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీలు అధికారంలో కి వస్తే ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా ? అని ప్రశ్నించారు. రోజుకు 24 గంటలు కంరెట్ ఇస్తారా అని ప్రశ్నించారు.
సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటన లాంటి కేసులు ఆగుతాయా అని ప్రజలను సూటిగా ప్రశ్నించారు.
సమాజ్ వాద్ పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే ఓ వర్గం కోసమే పని చేస్తాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల అభివృద్ధికి పాటు పడుతుందని ప్రజలకు హామి ఇచ్చారు.
ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీని ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి రాకుండా ప్రజలను అడ్డుకోవాలని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు.