Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ ప్రభుత్వం తీరు ఔరంగజోబు పాలించినట్లు ఉంది, ప్రజలు మరో తప్పు చేస్తారా చెప్పండి?

కర్ణాటక రాష్ట్రంలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో 28 స్థానాలు గెలుస్తామని. బీజేపీకి 25 సీట్లు వస్తాయని, జేడీఎస్‌కు 3 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ రాధా మోహన్‌దాస్ అగర్వాల్ జోస్యం చెప్పారు. మంగళవారం హాసన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తాను నెల రోజులుగా కర్ణాటకలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నానని అన్నారు.

ఇదే ఉద్దేశ్యంతో హాసన్‌కు వచ్చి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నానని, ప్రధాని మోదీకి అన్ని వైపుల నుండి అపూర్వ మద్దతు లభించిందని, నరేంద్ర మోదీకి ఓటు వేయడానికి ప్రజలు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని రాధా మోహన్ దాస్ అగర్వాల్ అన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు మార్జిన్‌ చాలా ఎక్కువ అని. కాంగ్రెస్‌తో మాకు చాలా గ్యాప్ ఉందని, బీజేపీని కనీసం కాంగ్రెస్ టచ్ చెయ్యలేదని బీజేపీ సీనియర్ నాయకుడు రాధా మోహన్ దాస్ అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు.

BJP leader Agarwal predicted that Congress will not win a single seat in Karnataka

బీజేపీ కార్యకర్తలు ఎంతో అవగాహన కలిగి ఉన్నారని, దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తారని రాధా మోహన్ దాస్ అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హాసన్ జిల్లాలోని బీజేపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కార్యకర్తలందరికీ మోదీజీ అంటే అపారమైన అభిమానం ఉందని, కర్ణాటక భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో కార్యకర్తలు తెలుసుకున్నారని రాధా మోహన్ దాస్ అగర్వాల్ చెప్పారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తోందని, హిందువులపై అణచివేత కొనసాగుతోంది. ఔరంగజేబు చేసినట్టే కర్ణాటకలో కాంగ్రెస్ చేస్తోందని రాధా మోహన్ దాస్ అగర్వాల్ ఆరోపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు కలిసి ఈ రాష్ట్రంలో హిందువులను అణిచివేస్తున్నారన్నారని రాధా మోహన్ దాస్ అగర్వాల్ ఆరోపించారు. రాజ్యసభ అభ్యర్థిని ఎన్నుకుంటే విధానసౌధలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.

BJP leader Agarwal predicted that Congress will not win a single seat in Karnataka

బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలింది, బెంగళూరులో హనుమాన్ చాలీస్ పాటలు పెడితే గూండాలు వచ్చి కొట్టారని, ఇలాంటి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు తమ తప్పును తెలుసుకుంటున్నారని రాధా మోహన్ దాస్ అగర్వాల్ ఆరోపించారు. 2023లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో చేసిన తప్పును కర్ణాటక ప్రజలు ఇప్పుడు సరిదిద్దుకుంటామని అంటున్నారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రజల దృష్టిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలౌతుందని బీజేపీ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ రాధా మోహన్‌దాస్ అగర్వాల్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+