నితీష్కు షాక్: మోడీ హవా, 21-29 సీట్లు బిజెపికి

సర్వే ప్రకారం... అధికార జెడి(యు) రెండు నుండి ఐదు సీట్లకు పరిమితం కానుంది. కాంగ్రెసు - ఆర్జెడి-ఎన్సీపి కూటమి 7 నుండి 13 స్థానాలను గెలుచుకుంటుంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసు 23-29 వరకు గెలుస్తుంది. ఒడిశాలో బిజెడికి 10-16 దక్కవచ్చు. మూడు నుండి ఏడు సీట్లతో బిజెపి ఒడిశాలో రెండో స్థానంలో నిలవనుంది. కాంగ్రెసు నాలుగు గెలుచుకునే అవకాశముంది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఖాతా తెరిచే అవకాశాలు లేదు. పశ్చిమ బెంగాల్, అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాలలో కాంగ్రెసు పార్టీ తొమ్మిది శాతం ఓటింగ్ షేర్ను పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, ఒపినియన్ పోల్లో భాగంగా సిఎన్ఎన్ ఐబిఎన్ - ది వీక్ 20,957 మంది ఓటర్ల నుండి అభిప్రాయం తీసుకుంది. 1,340 ప్రాంతాలలో ఈ అభిప్రాయాలను సేకరించారు. ప్రతి సెగ్మెంటులో నాలుగు పోలింగ్ సెంటర్ల పరిధిలోని ఓటర్ల అభిప్రాయాలను తీసుకున్నారు.












Click it and Unblock the Notifications