బీజేపీ మాస్టర్ ప్లాన్! తదుపరి టార్గెట్ సెట్!!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే అందరినీ ఆశ్చర్యపరిచింది. అధికార ఎన్డీయే కూటమి 200 సీట్ల మార్కును దాటి దూసుకుపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీష్ కుమార్ జోడీ మరోసారి సూపర్ హిట్ అయిందని స్పష్టమైంది. మహాఘటబంధన్ కూటమికి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఎన్డీఏ కూటమి 243 సీట్లలో 207 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 95 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, జేడీయూ 84 సీట్లు సాధించింది.
మోదీ-నితీష్ జోడీపై బీజేపీ ప్రశంసలు
బీహార్ ప్రజల తీర్పుతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. ఈ విజయాన్ని పార్టీ నాయకత్వం మోదీ-నితీష్ల జోడీకి ఆపాదిస్తోంది. బీహార్ బీజేపీ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "జోడీ మోదీ-నితీష్లది హిట్ అయింది, బీహార్ అభివృద్ధి మళ్లీ రిపీట్ అయింది" ('జోడీ మోదీ-నితీష్ కే హిట్ హో గయీల్, బీహార్ కే వికాస్ ఫిర్ రిపీట్ హో గయీల్') అని రాసుకొచ్చింది. మరో పోస్ట్లో, "ఇద్దరు అన్నదమ్ములు మోదీ-నితీష్ల జోడీ సూపర్ హిట్! ఎన్డీఏ సాధించిన ఈ చారిత్రక విజయం ప్రజా తీర్పు, సుపరిపాలన విజయం" అని పేర్కొంది.

जोड़ी मोदी-नीतीश जी के हिट हो गयील,
— BJP Bihar (@BJP4Bihar) November 14, 2025
बिहार के विकास फिर रिपीट हो गयील!#NDA_कहे_आभार_बिहार pic.twitter.com/cg0Y6VkVNe
రాహుల్ గాంధీపై అమిత్ మాల్వియా తీవ్ర విమర్శలు
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై బీహార్ ఎన్నికల పరాజయం నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు: "రాహుల్ గాంధీ! మరో ఎన్నిక, మరో ఓటమి! ఎన్నికల నిలకడకు బహుమతి ఉంటే ఆయన అందరికంటే ముందంజలో ఉంటారు. ఈ పరాజయాల పరంపరను ఆయన ఎలా సాధిస్తున్నారో వైఫల్యాలు కూడా ఆలోచిస్తున్నాయి. రెండు దశాబ్దాలలో రాహుల్ గాంధీ 95 ఎన్నికల ఓటములను ఎదుర్కొన్నారని, ఇది ప్రజాస్వామ్య సంస్థలపై ఆయన చేస్తున్న దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే చర్య మాత్రమే." అని అమిత్ మాల్వియా విమర్శించారు.
Rahul Gandhi!
— Amit Malviya (@amitmalviya) November 14, 2025
Another election, another defeat!
If there were awards for electoral consistency, he’d sweep them all.
At this rate, even setbacks must be wondering how he finds them so reliably. pic.twitter.com/y4rH6g62qG
బీజేపీ తదుపరి టార్గెట్ సెట్!
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం, బీజేపీ దిగ్గజ నాయకుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, బీహార్ విజయాన్ని ప్రస్తావిస్తూనే, పార్టీ యొక్క తదుపరి లక్ష్యాన్ని స్పష్టం చేశారు: "మగధ్ (బీహార్) గెలిచాం, అవధ్ (ఉత్తరప్రదేశ్) కూడా గెలుస్తాం. 2027లో 2017ను పునరావృతం చేస్తాం!" అని ఎక్స్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు బీహార్ విజయం తర్వాత బీజేపీలో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని, రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునేందుకు పార్టీ సన్నద్ధమవుతున్న తీరును తెలియజేస్తున్నాయి.
मगध जीता, अवध भी जीतेंगे। 2027 में 2017 दोहराएंगे!
— Keshav Prasad Maurya (@kpmaurya1) November 14, 2025
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications