దేశ భద్రతే ముఖ్యం.. అధికారంలో ఉండటం కాదు: ఆలం విడుదలపై రాజ్నాథ్
న్యూఢిల్లీ/ఘజియాబాద్: తమకు దేశ భద్రతే ప్రథమ ప్రాధాన్యమని, అధికారంలో ఉండటం కాదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కాశ్మీరీ వేర్పాటువాది మసరత్ ఆలం విడుదల పట్ల దేశ వ్యాప్తంగా వెల్లువెత్తున్న నిరసనల నేపథ్యంలో రాజ్నాథ్ పైవిధంగా స్పందించారు.
జమ్మూకాశ్మీర్లో పిడిపితో పొత్తు ఉన్నా ఇలాంటి చర్యల్ని తాము సహించబోమని ఆయన చెప్పారు. ఈ విషయంలో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తమను కలచివేసిందని అన్నారు. సమాచారం, అంగీకారం లేకుండా ఆలంను విడుదల చేయడం గర్హనీయమని అన్నారు.

సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు కాశ్మీర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కంటే దేశ ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ సామాజిక భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
ఇదే విషయాన్ని సోమవారం పార్లమెంట్ లో కూడా చెప్పానని, మరోసారి దానికే కట్టుబడి ఉన్నానని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం బిజెపి-పిడిపిల మధ్య భిన్నమైన వాతావరణం నెలకొనడంతో వారి భాగస్వామ్యం ఐదేళ్ల వరకు కొనసాగుతుందా?అనేది పలు అనుమానాలకు తావిస్తోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications