క్షీణించిన అద్వానీ ఆరోగ్యం..హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 9గంటలకు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం క్షీణించండంతో అద్వానీని ఎమర్జెన్సీకి తరలించారు. గత నెల 26న కడా అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉండటంతో డాక్టర్లు చిన్న పాటి సర్జరీ చేసి డిశ్చార్జ్ చేశారు.
ఈ క్రమంలోనే మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం అద్వానీ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఆయన క్షేమంగా తిరిగి రావాలని బీజేపీ శ్రేణులు పూజలు చేస్తున్నారు. అద్వానీ కష్ట ఫలితంగానే ఈరోజున బీజేపీ దేశాన్ని పరిపాలించగల్గుతుందని..అలాంటి నేత పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మరోవైపు ప్రధాని మోదీ సైతం అద్వానీ ఆరోగ్య పరిస్ధితి గురించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలను అడిగి తెలుసుకుంటున్నారు. అద్వానీకి మైరుగైన వైద్యం అందించాలని మోదీ వైద్యులకు సూచించారు. దేశ ప్రధానిగా మూడోసారి పగ్గాలు చేపట్టే ముందు మోదీ అద్వానీ దగ్గరకు వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications