అంద దళితుడి బలవన్మరణం : కుమారుడి హంతకులపై చర్యలు తీసుకోకపోవడంతో ...
కోల్కతా : చేతికొచ్చిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతని చావకొట్టిన వారు మాత్రం వీధుల్లో దర్జాగా తిరుగుతున్నారు. వారిపై చర్యలు తీసుకొమ్మని అడిగితే పట్టించుకునే పోలీసు లేడు. పైగా చనిపోయిన యువకుడి తండ్రి అందుడు .. ఇక తనకు న్యాయం జరగదని భావించాడు. కొడుకు దగ్గరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య, మరో కుమారుడిని వదిలి .. విషం తాగి ఆసువులు బాశాడు. రాజస్థాన్లో జరిగిన ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో శోకం నింపింది. బాధిత కుటుంబం దళితులు కాబట్టే పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిరుపేద అంద దళితుడు
రాజస్థాన్లోని భీవండికి చెందిన రాతిరన్ జాతవ్ దళితుడు. అతను నిరుపేద అంధుడు కూడా. అతనికి భార్య, హరీశ్, దినేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుడు చేసిన ప్రమాదం అతని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గత నెల 16న హరీశ్ .. రహదారిపై బైక్పై వెళ్తున్నాడు. అయితే అతను ఓ మహిళను ఢీ కొన్నాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమె కుటుంబసభ్యులు కోపోద్రిక్తులయ్యారు. హరీశ్ ఆచూకీ కనుకొని దాడి చేశారు. ఎంతలా అంటే అతన చనిపోయేలా చితక్కొట్టారు. తలకు తీవ్రగాయాలవడంతో .. ఢిల్లీలోని సఫ్దార్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. రెండురోజుల తర్వాత హరీశ్ చనిపోయాడు.

కుమారుడి మృతితో
హరీశ్ మృతితో అతని తండ్రి రతన్ కలత చెందాడు. అతనిపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. కానీ దళిత సామాజిక వర్గానికి చెందిన రాతిరన్ గోడును పట్టించుకోలేదు ఖాకీలు. నెల గడుస్తోన్న వారిపై చర్యలు తీసుకోలేదు. అదీ కాకుండా మహిళను ఢీ కొట్టాడని హరీశ్పై కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు రతన్. తనకు న్యాయం జరగదని భావించాడు. నిన్న రాత్రి విషం తాగి చనిపోయాడు. తన కుమారుడిని హతమార్చిన దుండగులపై చర్యలు తీసుకోవడం లేదని .. అలాగే దాడిచేసిన వారు బెదిరిస్తున్నారని బంధువులు చెప్తున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన తండ్రీకొడుకులు చనిపోవడంతో కలకలం నెలకొంది.

అంతా మీరే చేశారు
తన తండ్రి చనిపోవడానికి పోలీసుల వైఖరే కారణమని రతన్ రెండో కుమారుడు దినేశ్ అంటున్నాడు. తమకు న్యాయం చేయాలని పోలీసుల చుట్టూ తిరిగిన లాభం లేకపోయిందన్నారు. నిందితులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకాడరని పేర్కొన్నారు. అందుకోసమే తన తండ్రి చనిపోయాడని పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు స్పందించి .. చర్యలు తీసుకుంటే ఇవాళ తమతో తండ్రి ఉండేవారని గద్గత స్వరంతో రోదిస్తూ చెప్పాడు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications