ఘోర పడవ ప్రమాదం: టీచర్ సహా 15 మంది చిన్నారులు మృతి
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. దీంతో నలుగురు టీచర్లు సహా 27 మంది చిన్నారులు గల్లంతయ్యారు. వీరిలో ఓ టీచర్ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. హరిణి సరస్సులో 27 మంది విద్యార్థులు కొంత దూరం వెళ్లాక వారు ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది.
సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటివరకు 11 మంది విద్యార్థులను కాపాడినట్లు ఫైర్ ఆఫీసర్ చీఫ్ పార్థ్ బ్రహ్మ్భట్ తెలిపారు. తమ బృందం ఘటనాస్థలికి చేరేకన్నా ముందే కొందరు స్థానికులు విద్యార్థులను కాపాడినట్లు ఆయన తెలిపారు.

విహారయాత్రలో భాగంగా బోటింగ్ కోసం వచ్చిన 27 మందిలో 23 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా న్యూ సన్రైజ్ స్కూల్కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రమాదం పట్ల ఆ రాష్ట్ర విద్యాశాఖమంత్రి కుబేర్ దిండోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
#WATCH | Gujarat: A boat carrying children capsized in Vadodara's Harni Motnath Lake. Rescue operations underway. pic.twitter.com/gC07EROBkh
— ANI (@ANI) January 18, 2024
బోటులో ప్రయాణిస్తున్న 23 మంది విద్యార్థుల్లో కేవలం 11 మంది మాత్రమే లైఫ్ జాకెట్లను ధరించారు. మిగతావారంతా ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పటిదాకా 11 మందిని రక్షించగలిగాము. వీరిలో కూడా ఒక విద్యార్థి మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. మరొక విద్యార్థిని ఎస్ఎస్జీ ఆస్పత్రికి తరలించాము' అని ఫైర్ ఆఫీసర్ చీఫ్ వెల్లడించారు. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications