Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘోర పడవ ప్రమాదం: టీచర్ సహా 15 మంది చిన్నారులు మృతి

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. దీంతో నలుగురు టీచర్లు సహా 27 మంది చిన్నారులు గల్లంతయ్యారు. వీరిలో ఓ టీచర్ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. హరిణి సరస్సులో 27 మంది విద్యార్థులు కొంత దూరం వెళ్లాక వారు ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది.

సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్​‌లో ఇప్పటివరకు 11 మంది విద్యార్థులను కాపాడినట్లు ఫైర్​ ఆఫీసర్​ చీఫ్​ పార్థ్​ బ్రహ్మ్​భట్​ తెలిపారు. తమ బృందం ఘటనాస్థలికి చేరేకన్నా ముందే కొందరు స్థానికులు విద్యార్థులను కాపాడినట్లు ఆయన తెలిపారు.

Boat Carrying Children Capsizes In Vadodara Lake, Eight Dead.

విహారయాత్రలో భాగంగా బోటింగ్​ కోసం వచ్చిన 27 మందిలో 23 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా న్యూ సన్​రైజ్​ స్కూల్‌​కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రమాదం పట్ల ఆ రాష్ట్ర విద్యాశాఖమంత్రి కుబేర్ దిండోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బోటులో ప్రయాణిస్తున్న 23 మంది విద్యార్థుల్లో కేవలం 11 మంది మాత్రమే లైఫ్​ జాకెట్లను ధరించారు. మిగతావారంతా ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పటిదాకా 11 మందిని రక్షించగలిగాము. వీరిలో కూడా ఒక విద్యార్థి మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. మరొక విద్యార్థిని ఎస్​ఎస్​జీ ఆస్పత్రికి తరలించాము' అని ఫైర్​ ఆఫీసర్​ చీఫ్ వెల్లడించారు. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+