దద్దరిల్లిన అస్సాం: మోడీ రాకకు ఒక్కరోజు ముందు.. హై అలర్ట్!
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ)కి చెందిన వ్యక్తులే ఈ బాంబు పేల్చినట్లు పోలీసులు నిర్దారించారు.
దిబ్రూగఢ్: ప్రధాని నరేంద్ర మోడీ రాకను వ్యతిరేకిస్తూ అసోంలో తీవ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. దిబ్రూగఢ్ జిల్లాలోని దికోమ్ చరియాలో ఉన్న ఓ ఆయిల్ పైప్ లైన్ లో బాంబు పేలుడు సంభవించడంతో.. చుట్టు పక్కల ప్రాంతాలు దద్దరిల్లాయి.
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ)కి చెందిన వ్యక్తులే ఈ బాంబు పేల్చినట్లు పోలీసులు నిర్దారించారు. అటు అరుణోదయ్ అసాం పేరిట మీడియా సంస్థలకు అందిన ఓ లేఖలో.. ఈ చర్యకు పాల్పడింది తామేనని ఉల్ఫా-ఐ అంగీకరించింది. ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఈ బాంబు పేలుడు చర్యకు పాల్పడినట్లు తెలిపింది.

కాగా, బాంబు పేలుడు జరిగిన ప్రదేశంలో అనుమానిత ఉల్ఫా (ఐ) తీవ్రవాది మృతదేహాం లభ్యమవడం గమనార్హం. . బాంబు ప్రమాదవశాత్తు పేలడంతో అతను అక్కడిక్కడే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మోడీ రాకకు ఒక్కరోజు ముందు బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ ఒక్కసారిగా అలర్ట్ అయింది. అస్సాం పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉల్ఫా-ఐ మరన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications