Bride: లవ్ మ్యారేజ్, రాత్రి కాపురం చేస్తాడు, పగలు భార్య కులం గుర్తు వస్తోంది, పెళ్లికూతుర్ని ఏం చేశారు ?
లవర్స్ గుడిలో పెళ్లి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు జరిగాయి. వివాహం జరిగిన రెండు నెలలకే కొత్త పెళ్లికూతరు అనుమానాస్పదంగా శవమై కనిపించడం కలకలం రేపింది.
చెన్నై/ రామనాథపురం: యువతి, యువకుడికి వివాహం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమికుల కులాలు వేరు. ప్రియురాలిది తక్కువ కులం కావడంతో పెళ్లికి ప్రియుడి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు జరిగాయి. పెళ్లికూతురు మేజర్ కావడంతో ఆమెను భర్తతో పాటు పంపించారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులను ఎవ్వరూ ఏమీ అనకూడదని పోలీసులు ఇరువైపు కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు. అయితే వివాహం జరిగిన రెండు నెలలకే కొత్త పెళ్లికూతరు అనుమానాస్పదంగా శవమై కనిపించడం కలకలం రేపింది.
Wife: ఉద్యోగం చేసే కంపెనీలో భార్యకు బాయ్ ఫ్రెండ్, సుకుమార్ హత్యకు సూపర్ స్కెచ్, భర్త ఫ్రెండ్ కు ?
ఉద్యోగం చేస్తున్న యువతి
తమిళనాడులోని రామనాథపురం జిల్లా తిరుపలైకుడి ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రియాంక (22) అనే యువతి 10వ తరగతి వరకు మాత్రమే చదివింది. తండ్రి చనిపోవడంతో తల్లికి తోడుగా ఉండాలని అనుకున్న ప్రియాంకా ఓ స్పిన్నింగ్ మిల్లులో ఉద్యోగం చేస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం రామనాథపురం జిల్లాలోని అవరంగుడికి చెందిన మణికందన్ అనే యువకుడితో ప్రియాంకాకు పరిచయం ఏర్పడింది.
తక్కువ కులం అని అభ్యంతరం
కొంతకాలం స్నేహితులుగా ఉన్న ప్రియాంకా, మణికందన్ చివరికి ప్రేమలో పడ్డారు. ప్రియాంకాది తక్కువ కులం కావడంతో వారి పెళ్లికి మణికందన్ కుటుంబ సభ్యుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. రెండు నెలల క్రితం ప్రేమికులు మణికందన్, ప్రియాంకా ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకున్నారు.
కేసులు పెట్టుకున్న ఫ్యామిలీలు
తన కుమారుడు కనిపించడం లేదని, ప్రియాంకా మాయ చేసి మా కొడుకును లేపుకుపోయిందని మణికందన్ కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. ప్రియాంకాను కిడ్నాప్ చేశారని ఆమె తల్లి పోలీసు కేసు పెట్టింది. పోలీసులు మణికందన్, ప్రియాంకాను పిలిపించి విచారణ చేశారు. తాను ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నానని, తనను ఎవ్వరూ కిడ్నాప్ చెయ్యలేదని ప్రియాంకా పోలీసులకు చెప్పింది.
తక్కువ కులం దానా, మా ఇంటి కోడలు అవుతావా ?
పెళ్లికూతురు ప్రియాంకా మేజర్ కావడంతో ఆమెను భర్త మణికందన్ తో పాటు పంపించారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులను ఎవ్వరూ ఏమీ అనకూడదని పోలీసులు ఇరువైపు కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రియాంకాను ఆమె భర్త మణికందన్ ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. తక్కువ కులం దానా నువ్వు మా ఇంటి కోడలు అయ్యి మా పరువు తీస్తున్నావని మణికందన్ తల్లి ప్రియాంకాను సూటిపోటి మాటతో చిత్రహింసలకు గురి చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
తల్లికి ఫోన్ చేసి విలపించిన ప్రియాంక
రెండు రోజుల క్రితం తన తల్లితో మాట్లాడిన ప్రియాంకా మా అత్త కులం పేరుతో ప్రతినిత్యం దూషిస్తున్నదని బోరన విలపించి కన్నీళ్లు పెట్టుకుంది. తనను ప్రతినిత్యం మణికందన్ కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఇందుకు తన భర్త మణికందన్ కూడా వారికి సహకరించాడని ప్రియాంకా ఆమె తల్లికి చెప్పి బోరున విలపించింది. నువ్వు మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నావని, ఇక నువ్వు రాజీకావడం తప్పా వేరే మార్గం లేదని ప్రియాంకాను ఆమె తల్లి శాంతింపజేసింది.
మీ కూతురు ఉరి వేసుకుంది
బుధవారం ప్రియాంకా సెల్ఫోన్కు ఆమె తల్లి ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించింది. చాలా సేపు ఫోన్ చేసినా ఎవరూ తీయలేదు. ఇంతలో ప్రియాంకా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఇరుగుపొరుగు వారు కలైయార్కోయిల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులకు ప్రియాంకా తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమె షాక్ అయ్యింది.
ప్రియాంకాను చంపేసి నాటకాలు ఆడుతున్నారు ?
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రియాంకా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శివగంగ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. తన కుమార్తె ప్రియాంకా మృతి మిస్టరీగా ఉందని ఆమె తల్లి వనిత శివగంగై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నా కూతురు ప్రియాంకాను మణికందన్ పెళ్లి చేసుకున్న తరువాత కులం పేరుతో వేధించారని, నా కూతుర్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ప్రియాంకా తల్లి అల్లుడు మణికందన్ తో పాటు అతని కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలల్లోనే నవవధువు ప్రియాంకా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని వెలుగు చూడటంతో ప్రాంతంలోని ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.