Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం మంచి మనసు, లంచ భాగ్యం స్కీమ్ త్వరలో విడుదల, దర్యాప్తు చేసే ధైర్యం ఉంటే ?

బెంగళూరు: మైసూరు (Mysuru)దసరా ఉత్సవాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం నుంచి కమీషన్ వసూలు చేసే పనిలో ఉన్న మీ ప్రభుత్వ పాలనలోని నీచమైన అవినీతితో కూరుకుపోయిందని బహిరంగంగా ప్రజల ముందు బట్టబయలైందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై విజయేంద్ర ఆరోపించారు. కర్ణాటకలో ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే త్వరలో ఈ రాష్ట్రంలో లంచ భాగ్యం అనే కొత్త పథకం మీరు ప్రవేశపెట్టడానికి సిద్దం అవుతున్నారని అనుమానం వస్తోందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ (BJP) ఎమ్మెల్యే, మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో (Karnataka) హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించి బుధవారం బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి సిద్దరామయ్య (siddaramaiah) బ్లాక్ మనీ ఖజానా ఉన్నచోట్లు వదిలేసి పేదల ఇంటిపై దాడులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కర్ణాటక (Karnataka)రాష్ట్రంలో ఆదాయపన్ను శాఖ సోదాలను ముఖ్యమంత్రిగా మీరు స్వాగతించాల్సి ఉందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర అన్నారు.

 BY Vijayendra alleged that Karnataka CM Siddaramaiah is going to start a new bribery scheme soon

అయితే వ్యాపారులు, కాంట్రాక్టర్ల అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ ప్రభుత్వం (govt) లోని పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సోదాలను పోల్చి చూస్తే అది నిజమే అనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే బీవై విజయేంద్ర ఆరోపించారు. కర్ణాటకలోని (Karnataka) సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వాన్ని చూస్తుంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారనే సామెత గుర్తుకు వస్తోందని బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ఆరోపించారు.

 BY Vijayendra alleged that Karnataka CM Siddaramaiah is going to start a new bribery scheme soon

మీ మాటలు ప్రభుత్వ దర్యాప్తు (CBI) సంస్థలను నిరుత్సాహపరిచే విదంగా ఉన్నాయని బీవై విజయేంద్ర ఆరోపించారు. మీ కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రభుత్వంలో (govt) జైలుకెళ్లిన నాయకులు, ఇంకా జైలుకెళ్లాల్సిన వారు చాలా మంది ఉన్నారని మీరు మరిచిపోయారని బీవై, విజయేంద్ర ఆరోపించారు. ఈ విషయాలు పూర్తిగా మరిచిపోయిన మీరు మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BSY) పేరు ప్రస్తావిస్తూ విమర్శించడం విడ్డూరంగా ఉందని, చరిత్రను మరచిపోయి మీరు మాట్లాడడం మీకే సరిపోతుందని, నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తే అందరికి మంచిదని బీవై. విజయేంద్ర మండిపడ్డారు.

 BY Vijayendra alleged that Karnataka CM Siddaramaiah is going to start a new bribery scheme soon

రాజకీయ చిక్కులను ఛేదించి న్యాయ పోరాటం చేసి ప్రజల దగ్గర మద్దతు సంపాధించి జనతా దర్బారులో మళ్లీ ముఖ్యమంత్రి (CM) అయిన నిజాయితీకలిగి మళ్లీ సీఎం అయిన నాయకుడు బీఎస్ యడ్యూరప్ప అని, అలాంటి వ్యక్తిని మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తే తగిన బుద్ది చెబుతామని ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే (MLA) బీవై, విజయేంద్ర హెచ్చరించారు. కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం త్వరలో లంచ భాగ్యం అనే అవినీతి పథకం అధికారికంగా ప్రకటించినా ఆశ్చర్చం లేదని బీజేపీ (BJP) ఎమ్మెల్యే, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BSY) కుమారుడు (son) బీవై, విజయేంద్ర ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+