సీఎం మంచి మనసు, లంచ భాగ్యం స్కీమ్ త్వరలో విడుదల, దర్యాప్తు చేసే ధైర్యం ఉంటే ?
బెంగళూరు: మైసూరు (Mysuru)దసరా ఉత్సవాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం నుంచి కమీషన్ వసూలు చేసే పనిలో ఉన్న మీ ప్రభుత్వ పాలనలోని నీచమైన అవినీతితో కూరుకుపోయిందని బహిరంగంగా ప్రజల ముందు బట్టబయలైందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై విజయేంద్ర ఆరోపించారు. కర్ణాటకలో ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే త్వరలో ఈ రాష్ట్రంలో లంచ భాగ్యం అనే కొత్త పథకం మీరు ప్రవేశపెట్టడానికి సిద్దం అవుతున్నారని అనుమానం వస్తోందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ (BJP) ఎమ్మెల్యే, మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో (Karnataka) హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించి బుధవారం బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి సిద్దరామయ్య (siddaramaiah) బ్లాక్ మనీ ఖజానా ఉన్నచోట్లు వదిలేసి పేదల ఇంటిపై దాడులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కర్ణాటక (Karnataka)రాష్ట్రంలో ఆదాయపన్ను శాఖ సోదాలను ముఖ్యమంత్రిగా మీరు స్వాగతించాల్సి ఉందని బీజేపీ (BJP) ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర అన్నారు.

అయితే వ్యాపారులు, కాంట్రాక్టర్ల అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ ప్రభుత్వం (govt) లోని పెద్దలు ప్రయత్నిస్తున్నారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సోదాలను పోల్చి చూస్తే అది నిజమే అనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే బీవై విజయేంద్ర ఆరోపించారు. కర్ణాటకలోని (Karnataka) సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వాన్ని చూస్తుంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారనే సామెత గుర్తుకు వస్తోందని బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ఆరోపించారు.

మీ మాటలు ప్రభుత్వ దర్యాప్తు (CBI) సంస్థలను నిరుత్సాహపరిచే విదంగా ఉన్నాయని బీవై విజయేంద్ర ఆరోపించారు. మీ కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రభుత్వంలో (govt) జైలుకెళ్లిన నాయకులు, ఇంకా జైలుకెళ్లాల్సిన వారు చాలా మంది ఉన్నారని మీరు మరిచిపోయారని బీవై, విజయేంద్ర ఆరోపించారు. ఈ విషయాలు పూర్తిగా మరిచిపోయిన మీరు మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BSY) పేరు ప్రస్తావిస్తూ విమర్శించడం విడ్డూరంగా ఉందని, చరిత్రను మరచిపోయి మీరు మాట్లాడడం మీకే సరిపోతుందని, నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తే అందరికి మంచిదని బీవై. విజయేంద్ర మండిపడ్డారు.

రాజకీయ చిక్కులను ఛేదించి న్యాయ పోరాటం చేసి ప్రజల దగ్గర మద్దతు సంపాధించి జనతా దర్బారులో మళ్లీ ముఖ్యమంత్రి (CM) అయిన నిజాయితీకలిగి మళ్లీ సీఎం అయిన నాయకుడు బీఎస్ యడ్యూరప్ప అని, అలాంటి వ్యక్తిని మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తే తగిన బుద్ది చెబుతామని ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే (MLA) బీవై, విజయేంద్ర హెచ్చరించారు. కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం త్వరలో లంచ భాగ్యం అనే అవినీతి పథకం అధికారికంగా ప్రకటించినా ఆశ్చర్చం లేదని బీజేపీ (BJP) ఎమ్మెల్యే, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BSY) కుమారుడు (son) బీవై, విజయేంద్ర ఆరోపించారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications