జాడ తెలిసింది: నీరవ్ మోడీ యూకేలోనే, భారత్ రప్పించేందుకు సీబీఐ యత్నాలు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో 13వేల కోట్ల కుంభకోణం చేసి దేశం విడిచిపారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ యూనైటెడ్ కింగ్డమ్(యూకే-బ్రిటన్)లో ఉన్నట్లు తేలిపోయింది. ఈ విషయాన్ని యూకే అధికారులు కూడా ధృవీకరించారు. ఈ క్రమంలో అతన్ని తిరిగి భారత్కు పంపించాలని కోరుతూ సీబీఐ అధికారులు యూకేను కోరారు.
నీరవ్ మోడీ, ఆయన మామ మెహుల్ ఛోక్సీలు పీఎన్బీలో రూ.13వేల కోట్ల మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కుంభకోణం బయటపడటానికి కొద్ది రోజుల ముందే ఈ ఏడాది జనవరిలో వీరు దేశం విడిచి పారిపోయారు.

అప్పటి నుంచి వారిని భారత్ రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2002 నుంచి భారత ప్రభుత్వం 29మంది పారిపోయిన నేరగాళ్లను స్వదేశానికి పంపించాల్సిందిగా యూకేను కోరింది.
అయితే, నీరవ్ మోడీ ఎక్కడ ఉన్నాడనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ, తాజాగా, యూకే అధికారులే ధృవీకరించడంతో నీరవ్ మోడీ యూకేలోనే ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరిలో నీరవ్, ఛోక్సీల పాస్ పోర్టులను భారత్ రద్దు చేసింది. అయినప్పటికీ ఇతర దేశాల పాస్పోర్టులతో నీరవ్ మోడీ వివిధ దేశాలకు వెళుతున్నారు.
-
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications