దినకరన్ కు మరో షాక్! ఫెరా కేసులో అభియోగాలు ఖరారు
అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్లుగా కేసు ఎదుర్కొంటున్న ఆయనపై మరో కేసులో కూడా అభియోగాలు.
చెన్నై: అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్లుగా కేసు ఎదుర్కొంటున్న ఆయనపై మరో కేసులో కూడా అభియోగాలు ఖరారయ్యాయి.
2001లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసులో దినకరన్ పై ఎగ్మూరు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం(ఫెరా)లోని పలు నిబంధనలు ఆయన ఉల్లంఘించినట్లుగా ఈడీ కేసు నమోదు చేసింది.

ఈ కేసు విచారణకు గురువారం వ్యక్తిగతంగా హాజరైన దినకరన్.. న్యాయమూర్తి అభియోగాలు చదివి వినిపించగా వాటిని తిరస్కరించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా 1.04,93,313 డాలర్ల అక్రమ లావాదేవీలను దినకరన్ నిర్వహించి, బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్ లోని డిప్పర్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ లోకి తరలించినట్లు ఈడీ కేసు నమోదు చేసింది.
అంతేకాకుండా 36,36,000 డాలర్లు, 1,00,000 పౌండ్లు విదేశాల్లో అక్రమ లావాదేవీలు జరిపినట్లు మరో కేసు కూడా నమోదు చేసింది. ఈ రెండు కేసుల్లో విచారణను న్యాయస్థానం జూన్ 22కు వాయిదా వేసింది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications