టిసిఎస్ టెక్కీపై రేప్, హత్య: ముగ్గురికి జీవిత ఖైదు
చెన్నై: టిసిఎస్ మహిళా టెక్కీ ఉమా మహేశ్వరిపై అత్యాచారం, ఆమె హత్య కేసులో తమిళనాడు రాజధాని చెన్నైలోని చెంగల్పట్టు మహిళా కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. మహేశ్వరిని దోషులు ఎత్తుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశారని కోర్టు నిర్ధారించింది.
ఉమా మహేశ్వరి చెన్నై శివారులోని సిప్కోట్ ఐటి పార్కులోని టిసిఎస్ కార్యాలయంలో పనిచేస్తూ ఉండేది. ముగ్గురు వలస కూలీలు రామ్ మండల్, ఉత్తమ్ మండల్, ఉజ్జల్ మండల్ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ఆమెను అపహరించి, ఆమెపై అత్యాచారం చేసి, చంపేశారు.

తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో మహిళా కోర్టు న్యాయమూర్తి ఆనంది 51 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించారు. 119 ఎగ్జిబిట్స్, 61 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ను పరిశీలించారు. ఈ ఏడాది సిబిసిఐడి పోలీసులకు సవాల్ విసిరిన కీలకమైన కేసుల్లో ఇదొక్కటి. శాస్త్రీయ పద్ధతుల్లో ముందుకు వెళ్లి, దర్యాప్తులో అధికారులు విజయం సాధించారు.
ఉమా మహేశ్వరి ఫిబ్రవరి 13 తేదీ రాత్రి నుంచి కేలంబాకం నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం అందింది. కార్యాలయం నుంచి బయలుదేరిన ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమె శవం ఫిబ్రవరి 22వ తేదీన బయటపడింది. తొలిసారి తమిళనాడు పోలీసులు ఈ కేసులో డ్రోన్ను వాడారు. డ్రోన్, మిట్ రీసెర్చ్ స్కాలర్స్ సాయంతో శవం కోసం గాలించి, పోలీసులు విజయం సాధించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications