నలుగురు మహిళా మావోయిస్టుల హతం
రాయపూర్: చత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా నాగలిగూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళా మావోయిస్టులు మరణించారు.
మావోయిస్టులు సమావేశమయినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందండంతో సుమారు 500 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మూడు జట్లుగా చీలిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ జరిపి తిరిగి వస్తున్న నేపథ్యంలో మొదటి దళంపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో వెనుకవైపు నుంచి వస్తున్న రెండో దళం మావోయిస్టులపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద ఉన్న విప్లవ సాహిత్యం, నాలుగు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద చత్తీస్గఢ్లో వరుసగా వారం రోజుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. అందులో ఐదుగురు మహిళా మావోయిస్టులు చనిపోవడం విశేషం.
ఈ ఎన్కౌంటర్ ఆదివారం తెల్లవారు జామున జరిగింది. మావోయిస్టుల శిబిరాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. నలుగురు మహిళా మావోయిస్టులు మరణించగా, మిగతా వారు అడవిలోకి పారిపోయినట్లు దంతెవాడ ఎస్పీ చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications