Chattishgarh: మరోసారి సత్తా చాటిన కమలం.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో క్లీన్ స్వీప్
Chattishgarh Municipal Elections: ఛత్తీస్గఢ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలుపవడ్డాయి. బీజేపీ మరోసారి తన సత్తాను నిరూపించుకుంది. ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో కాంగ్రెస్ ను తుడిచిపెట్టేసింది. ఛత్తీస్ గఢ్ లోని 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 49 మున్సిపల్ కౌన్సిల్ లు, 114 నగర పంచాయతీలకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగింది. బీజేపీ 10 మున్సిపల్ కార్పొరేషన్లలో విజయ పతాకాన్ని ఎగురవేసింది. అయితే కాంగ్రెస్ కార్పొరేషన్లలో ఖాతా కూడా తెరవలేకపోయింది. 49 మున్సిపాలిటీలలో బీజేపీ 35 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఆప్ కూడా మున్సిపాలిటీలలో ఒక స్థానాన్ని గెలుచుకుని ఖాతాను తెరిచింది. బోద్రిలో ఆప్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. కాగా 5 సీట్లు స్వతంత్రుల ఖాతాలోకి వెళ్లాయి. నగర పంచాయతీలలో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 114 నగర పంచాయతీ స్థానాలకు గానూ బీజేపీ 81, కాంగ్రెస్ 22, బీఎస్పీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. కాగా 10 స్థానాలు స్వతంత్రుల ఖాతాలోకి వెళ్లాయి.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సీఎం విష్ణుదేవ్ ఏమన్నారంటే..?
మున్సిపల్ ఎన్నికల్లో విజయం తర్వాత ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించిందని అన్నారు. బీజేపీపై విశ్వాసం ఉంచిందనందుకు ఛత్తీస్ గఢ్ ఓటర్లకు మరోసారి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అటల్ విశ్వాస్ పత్రంలో తాము ఇచ్చిన హామీలను 100 శాతం కచ్చితంగా నెరువేరుస్తామని సీఎం ప్రజలకు మరోసారి హామీ ఇచ్చారు.

*మున్సిపల్ కార్పొరేషన్లు-10
బీజేపీ- 10
కాంగ్రెస్-0
స్వతంత్రులు- 0
*మున్సిపాలిటీలు- 49
బీజేపీ- 35
కాంగ్రెస్- 8
ఆమ్ ఆద్మీ పార్టీ- 1
స్వతంత్రులు- 5
*నగర పంచాయతీలు -114
బీజేపీ -81
కాంగ్రెస్ -22
బీఎస్పీ-1
స్వతంత్రులు -10
సీఎం విష్ణుదేవ్ ను అభినందించిన జేపీ నడ్డా
ఛత్తీస్ గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ సాధించిన విజయంపై సీఎం విష్ణుదేవ్ సాయి, రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమం, గిరిజన అనుకూల పథకాలపై రాష్ట్ర ప్రజల అచంచల విశ్వాసానికి ప్రతీకి అని స్పష్టం చేశారు.
అదృష్టాన్ని పరీక్షించుకున్న 10 వేల మంది అభ్యర్థులు
ఛత్తీస్ గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో 10 వేలకు పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఓటింగ్ కోసం మొత్తం 5,970 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వీటిలో 1,531 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా, 132 అత్యంత సున్నితమైనవిగా ప్రకటించబడ్డాయి. వివిధ మున్సిపాలిటీల్లో 32 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి తెలిపారు.
-
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications