12.30 గంటలకు 25శాతం.. ఛత్తీస్ గఢ్ లో కొనసాగుతున్న పోలింగ్
ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మలిదశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు 25 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. 72 స్థానాలకు గాను దాదాపు పదకొండు వందల మంది పోటీపడుతున్నారు. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. పది గంటల వరకు 12.54 శాతం నమోదైన ఓటింగ్ మధ్యాహ్నం 12.30 కల్లా 25 శాతానికి పెరిగింది.
రెండో దశ పోలింగ్ లో భాగంగా మంగళవారం కొనసాగుతున్న 72 స్థానాలకు 1079 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 19మంది మహిళా నేతలున్నారు. రాయ్ పూర్ సౌత్ నుంచి అత్యధికంగా 46 మంది పోటీ చేస్తుంటే.. బింద్రానవ్ గఢ్ స్థానంలో అతి తక్కువగా ఆరుగురు అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

మావోయిస్టు దాడులు జరిగే ఛాన్సుందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. దాదాపు లక్షకు పైచిలుకు సెక్యూరిటీ సేవలు అందిస్తున్నారు. డ్రోన్లు, చాపర్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అదలావుంటే తమ గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవంటూ పరేవపలి గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications