అరుణాచల్ప్రదేశ్ బాలుడ్ని భారత్కు అప్పగించిన చైనా పీఎల్ఏ: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరామ్ తరోన్ను చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) తిరిగి అప్పగించింది. మిరామ్ తరోన్ ను చైనా సైన్యం అపహరించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం చెలరేగడంతో.. చైనా బలగాలతో హాట్లైన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రమంలోనే ఆ యువకుడి ఆచూకీ లభించినట్లు పీఎల్ఏ గత ఆదివారం తెలిపింది. తాజాగా, గురువారం అతడ్ని భారత సైన్యానికి అప్పగించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఇతర ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్లు తెలిపారు.

అప్పర్ సియాంగ్ జిల్లా జిడో గ్రామానికి చెందిన ఈ యువకుడిని చైనా పీఎల్ఏ బలగాలు కిడ్నాప్ చేసినట్లు అరుణాచల్ప్రదేశ్ తూర్పు ఎంపీ తాపిర్ గావ్ మొదట ఆరోపించారు. మిరామ్ వెంటే ఉన్న అతని స్నేహితుడు జానీ యాయింగ్ చైనా సైనికుల నుంచి తప్పించుకోగలిగాడని ఆయన ట్వీట్ చేశారు.
The Chinese PLA handed over the young boy from Arunachal Pradesh Shri Miram Taron to Indian Army at WACHA-DAMAI interaction point in Arunachal Pradesh today.
— Kiren Rijiju (@KirenRijiju) January 27, 2022
I thank our proud Indian Army for pursuing the case meticulously with PLA and safely securing our young boy back home 🇮🇳 pic.twitter.com/FyiaM4wfQk
అయితే, రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆర్మీ వర్గాలు మాత్రం ఈ ఘటనను అదృశ్యంగా పేర్కొంది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సరిహద్దుల్లో మూలికలు సేకరణతోపాటు వేటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైనట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే చైనా బలగాలతో సంప్రదింపులు జరిపి తాజాగా అతడ్ని స్వదేశానికి రప్పించాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications