ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. గొంతులు తెగి మరో ఇద్దరు మృతి
సంక్రాంతి పండగంటే గాలి పటాలు ఎగురవేయాల్సిందే. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ సంతోషంగా గాలి పటాలను ఎగురవేస్తుంటారు. అయితే ఎంతో సరదాగా ఆడుకునే ఈ ఆటలో చాలా ప్రమాదం పొంచి ఉన్న సంగతి తెలిసిందే. పండగ వేళల్లో సరదాగా ఆడే ఈ ఆట కొందరి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాను ఉపయోగించడమే.. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో అనేకమంది ఈ చైనా మాంజా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా చైనా మాంజాతో గొంతు తెగి కర్ణాటకలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కర్ణాటక బీదర్ జిల్లాలోని తలమదగి బ్రిడ్జి వద్ద ఈ విషాదం జరిగింది. సంజు కుమార్ అనే వ్యక్తి బైకుపై వెళ్తున్న క్రమంలో గొంతుకు చైనా మాంజా తగిలింది. ఆ మాంజా దారం గొంతు లోపలి వరకు తెగింది. దీంతో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సంజును చూసిన స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో సంజు కుమార్ చివరిసారిగా తన కూతురికి ఫోన్ చేశాడు. కానీ ఆమె లిఫ్ట్ చేసే లోపే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సంజు కుమార్ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ లేట్ గా రావడం వల్లే అతడు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రాణాంతక చైనా మాంజా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఇక మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. చైనా మాంజా మెడకు చుట్టుకుని ఓ వ్యక్తి మరణించడం కలకలం రేపింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అవిదేశ్(35) అనే వ్యక్తి టూ వీలర్ పై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా చైనా మాంజా అతడి గొంతుకు చుట్టుకుంది. దీంతో గొంతు తెగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం 2016 లోనే రాష్ట్ర వ్యాప్తంగా చైనీస్ మాంజాను నిషేధించింది. కానీ చాలా మంది వ్యాపారస్థులు అక్రమంగా వీటి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. చైనీస్ మాంజాను నైలాన్, సింథటిక్ దారంతో తయారు చేస్తారు. చైనీస్ మాంజాతో పక్షులు, మనుషులు ప్రమాదంలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ మాంజాపై పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications