ఫేస్బుక్ చాటింగ్ వద్దన్నందుకు తుపాకీతో కాల్చుకున్న 9వ తరగతి విద్యార్థి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్లో నిరంతరం చాటింగ్ చేయొద్దని తండ్రి మందలించినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నాయిని ప్రాంతంలోని పరాస్నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే... బుధవారం రాత్రి తొమ్మిదో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్లో ఫేస్బుక్ ద్వారా తన స్నేహితులతో చాటింగ్ చేస్తున్నాడు. గంటల తరబడి చాటింగ్ చేయడంతో తండ్రికి కోపమొచ్చింది.

గంటల తరబడి చాటింగ్ చేయొద్దని తండ్రి తన కుమారుడ్ని మందలించాడు. దీంతో క్షణికావేశానికి గురైన అతని కుమారుడు తన గదిలోకి వెళ్లి తుపాకితో కాల్చుకున్నాడు. పెద్దగా శబ్దం రావడంతో గదిలోకి వెళ్లి చూడగా కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
అతడ్ని కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ మృతుడి తండ్రిదని తెలిపారు. మృతుడి తండ్రి ఓ న్యాయవాదని తెలిపారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications