సీఎంకు తప్పిన పెనుముప్పు: హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!..
హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిని కొద్దిసేపటికే ఓ పక్షి ఎదురుగా వచ్చి విమానాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ బెంగుళూరులోని హెచ్ఏఎల్ విమానశ్రయంలో ల్యాండ్ చేశారు.
బెంగుళూరు: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పెనుముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఓ పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అవడంతో సీఎం సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
శ్రావణబెళగలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్దరామయ్య ఈరోజు హెలికాప్టర్ ద్వారా పయనమయ్యారు. ఆయనతో పాటు హోంమంత్రి పరమేశ్వర, మరో ముగ్గురు అధికారులు వెళ్లారు. అయితే హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిని కొద్దిసేపటికే ఓ పక్షి ఎదురుగా వచ్చి విమానాన్ని ఢీకొట్టింది.

వెంటనే అప్రమత్తమైన పైలట్ బెంగుళూరులోని హెచ్ఏఎల్ విమానశ్రయంలో ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ ను పక్షి ఢీకొందని, అయితే దీనివల్ల ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని పైలట్ చెప్పారు. కొద్దిపాటి అంతరాయం తర్వాత సీఎం సిద్దరామయ్య తిరిగి అదే విమానంలో శ్రావణబెళగలకు పయనమయ్యారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications