స్మగ్లర్ కోసం ప్రాణాలు వదిలిన కమాండర్
బాలూర్ ఘాట్: భారత జవాన్లు దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం వదలడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారని మరో సారి రుజువు అయ్యింది. ఒక స్మగ్లర్ ను పట్టుకునేందుకు నదిలో దూకిన బీఎస్ఎఫ్ కమాండర్ జలసమాధి అయిన సంఘటన అందరిని కలిచివేసింది.
స్మగ్లర్ ను నదిలో వెంటాడిన బీఎస్ఎఫ్ కమాండర్ వీరమరణం పొందాడు. బీఎస్ఎఫ్ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారత్ -బంగ్లాదేశ్ సరిహద్దులో ఓ నది ప్రవహిస్తుంది. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు నిత్యం గస్తీ తిరుగుతుంటారు.

ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ సెక్టార్ కమాండర్ ప్రశాంత్ రాయ్ విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం భారత్ భూభాగంలోకి ఒక స్మగ్లర్ ప్రవేశిస్తున్న విషయం ప్రశాంత్ రాయ్ గుర్తించాడు. చోరబాటుదారుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఆ సందర్బంలో అతను నదిలో దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ప్రశాంత్ రాయ్ నదిలో దూకి స్మగ్లర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే కొంత దూరం ఈదిన తరువాత ప్రమాదవశాత్తు ప్రశాంత్ రాయ్ నీటిలో మునిగిపోయి ప్రాణాలు వదిలి పెట్టాడని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications