స్మగ్లర్ కోసం ప్రాణాలు వదిలిన కమాండర్
బాలూర్ ఘాట్: భారత జవాన్లు దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం వదలడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారని మరో సారి రుజువు అయ్యింది. ఒక స్మగ్లర్ ను పట్టుకునేందుకు నదిలో దూకిన బీఎస్ఎఫ్ కమాండర్ జలసమాధి అయిన సంఘటన అందరిని కలిచివేసింది.
స్మగ్లర్ ను నదిలో వెంటాడిన బీఎస్ఎఫ్ కమాండర్ వీరమరణం పొందాడు. బీఎస్ఎఫ్ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారత్ -బంగ్లాదేశ్ సరిహద్దులో ఓ నది ప్రవహిస్తుంది. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు నిత్యం గస్తీ తిరుగుతుంటారు.

ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ సెక్టార్ కమాండర్ ప్రశాంత్ రాయ్ విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం భారత్ భూభాగంలోకి ఒక స్మగ్లర్ ప్రవేశిస్తున్న విషయం ప్రశాంత్ రాయ్ గుర్తించాడు. చోరబాటుదారుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఆ సందర్బంలో అతను నదిలో దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ప్రశాంత్ రాయ్ నదిలో దూకి స్మగ్లర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే కొంత దూరం ఈదిన తరువాత ప్రమాదవశాత్తు ప్రశాంత్ రాయ్ నీటిలో మునిగిపోయి ప్రాణాలు వదిలి పెట్టాడని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications