సదానంద ఇంటి నేమ్ప్లేట్ తీసేసి, కాళ్లతో తొక్కారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే మంత్రి సదానంద గౌడ ఇంటిపై కాంగ్రెసు కార్యకర్తలు దాడి చేశారు. లోకసభలో ఆయన మంగళవారం రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆయన నేమ్ప్లేట్ తొలగించి, కింద పడేసి కాళ్లతో తొక్కారు. ఇంట్లోకి రాకుండా మంత్రి కారును అడ్డుకున్నారు.
బడ్జెట్లో ఎఫ్డిఐలు, ప్రైవైట్ భాగస్వామ్యం ప్రస్తావనలతో రైల్వేలను ధనికులకు అనుకూలంగా మారుస్తున్నారని కాంగ్రెసు ఆరోపిస్తోంది. కాంగ్రెసు కార్యకర్తల దాడిని పరిణతి లేని ప్రతిపక్ష చర్యగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు.

శాంతియుతంగా నిరసన తెలియజేయాలని, రైల్వే మంత్రి నేమ్ప్లేట్ తొలగించడం, కారును అడ్డుకోవడం సరి కాదని కాంగ్రెసు సీనియర్ నేత అర్విందర్ సింగ్ లవ్లీ ఆ తర్వాత అన్నారు.
కాగా, సదానంద ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెదవి విరిచారు. తమ రాష్ట్రానికి మొండి చేయి చూపారని ఆమె విమర్సించారు. కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్లో తమ రాష్ట్రానికి కేటాయించింది ఏమీ లేదని ఆమె అన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications