సదానంద ఇంటి నేమ్ప్లేట్ తీసేసి, కాళ్లతో తొక్కారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే మంత్రి సదానంద గౌడ ఇంటిపై కాంగ్రెసు కార్యకర్తలు దాడి చేశారు. లోకసభలో ఆయన మంగళవారం రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆయన నేమ్ప్లేట్ తొలగించి, కింద పడేసి కాళ్లతో తొక్కారు. ఇంట్లోకి రాకుండా మంత్రి కారును అడ్డుకున్నారు.
బడ్జెట్లో ఎఫ్డిఐలు, ప్రైవైట్ భాగస్వామ్యం ప్రస్తావనలతో రైల్వేలను ధనికులకు అనుకూలంగా మారుస్తున్నారని కాంగ్రెసు ఆరోపిస్తోంది. కాంగ్రెసు కార్యకర్తల దాడిని పరిణతి లేని ప్రతిపక్ష చర్యగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు.

శాంతియుతంగా నిరసన తెలియజేయాలని, రైల్వే మంత్రి నేమ్ప్లేట్ తొలగించడం, కారును అడ్డుకోవడం సరి కాదని కాంగ్రెసు సీనియర్ నేత అర్విందర్ సింగ్ లవ్లీ ఆ తర్వాత అన్నారు.
కాగా, సదానంద ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెదవి విరిచారు. తమ రాష్ట్రానికి మొండి చేయి చూపారని ఆమె విమర్సించారు. కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్లో తమ రాష్ట్రానికి కేటాయించింది ఏమీ లేదని ఆమె అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications