సిట్టింగ్ ఎంపీ మార్ఫింగ్ వీడియోలు వైరల్, సీన్ లోకి ప్రధాని మోదీ, మాజీ సీఎం, కాంగ్రెస్ టార్గెట్ !
కర్ణాటకలోని హాసన్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోలను ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఎన్నికల ఏజెంట్ ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ పెన్ డ్రైవ్ ఉదంతం బయటకు రావడంతో హాసన్ జిల్లా రాజకీయల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
జేడీఎస్, బీజేపీ కూటమి ఎన్నికల ఏజెంట్ పూర్ణచంద్ర తేజస్వి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. నవీన్ గౌడ తదితరులు ఈ మార్ఫింగ్ వీడియోలను వైరల్ చేస్తున్నారని తేజస్వి తన ఫిర్యాదులో ఆరోపించారు. హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పేరు చెడగొట్టాలనే ఉద్దేశంతో నవీన్ గౌడ తదితరులు వీడియోలు, ఫోటోలను మార్ఫింగ్ చేసి హాసన్ లోక్సభ నియోజకవర్గ ఓటర్లకు పెన్ డ్రైవ్, సీడీ, వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారని తేజస్వి ఆరోపించారు.

ಕುಮಾರಸ್ವಾಮಿಯವರೇ,
— Karnataka Congress (@INCKarnataka) April 25, 2024
ನೀವು ತೋರಿಸಿ, ತೋರಿಸಿ ಜೇಬೋಳಗೆ ಇಳಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದ ಪೆನ್ ಡ್ರೈವ್ನಲ್ಲಿನ ರಹಸ್ಯ ಈಗ ಹೊರಬಂದಿದೆಯೇ?
ಹಾಸನದ ಬೀದಿ ಬೀದಿಗಳಲ್ಲಿ ಚೆಲ್ಲಾಡುತ್ತಿರುವ ಪೆನ್ ಡ್ರೈವ್ ನಿಮ್ಮದೇನಾ?
ಕುಮಾರಸ್ವಾಮಿಯವರೇ,
ರಾಜ್ಯದ ಮಹಿಳೆಯರ ಬಗ್ಗೆ ನಾಲಿಗೆ ಹರಿಬಿಟ್ಟು ದಾರಿ ತಪ್ಪಿದ್ದಾರೆ ಎಂದಿದ್ದ ನೀವು
ಯಾಕೆ ಈಗ ಗಾಢ ಮೌನ ವಹಿಸಿದ್ದೀರಿ?… pic.twitter.com/610WNt1weR
ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ వ్యవహారంలో మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ మాజీ సీఎం కుమారస్వామిని కాంగ్రెస్ ప్రశ్నించింది. పెన్ డ్రైవ్ నా జోబులో ఉందంటూ ఇంతకాలం చెబుతున్న కుమారస్వామి ఆ పెన్ డ్రైవ్ ఇదేనా ?, ఆ పెన్ డ్రైవ్ మీదేనా ?, హాసన్ జిల్లాలోని వీదివీదిలో చక్కర్లు కొడుతున్న ఆ పెన్ డ్రైవ్ ఇదేనా ? అంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం కుమారస్వామిని ప్రశ్నించింది.
ಕುಮಾರಣ್ಣ
— Karnataka Congress (@INCKarnataka) April 25, 2024
ದಾರಿ ತಪ್ಪಿದವರು ಯಾರಣ್ಣಾ..?????????????????????????????????????????????????????? pic.twitter.com/FKJ1pduQoy
కర్ణాటక మహిళలను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న మాజీ సీఎం కుమారస్వామి మీ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. మాజీ సీఎం కుమారస్వామితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. మహిళ మంగళసూత్రాల వ్యవహారంలో నోరుపారేసుకున్న ప్రధాని రేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది,
మహిళల మానం, మర్యాదలు తీస్తున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బీజేపీ ఎలా మద్దతు ఇస్తుందో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మహిళలు, వారి మంగళసూత్రాల మీద మీకు గౌరవం ఉంటే హాసన్ జేడీఎస్, బీజేపీ కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంలో జరిగిన ఈ వ్యవహారంపై వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన మార్ఫింగ్ వీడియో బయటకు రావడంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications