ఉత్తర్ ప్రదేశ్ లో స్టార్ క్యాంపెయినర్లు, కాంగ్రెస్ జాబితాలో నగ్మాకుచోటు
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్న కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకుగాను 40 మంది స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది.
న్యూఢిల్లీ :ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను దింపనుంది. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో కలిసి ఆ పార్టీ పోటీచేస్తోంది.పార్టీ సీనియర్లతో పాటు సినీ నటులను కూడ ఈ క్యాంపెయిన్ లో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోనుంది.
ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 105 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తోంది. మిగిలిన స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతివ్వనుంది. ఈ రాష్ట్రంలో బిజెపిని నిలువరించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపుతోంది.
పార్టీ అధినేత్రి సోనియాగాందీ, మాజీ ప్రధాని మన్మోహన్ సహ, మాజీ ముఖ్యమంత్రులు,ప్రియాంక, రాహుల్ లతో పాటు పార్టీ సీనియర్లు, సినీ నటులు 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపనుంది.

తెలుగుతొ పాటు పలు భాష చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి నగ్మా కూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింధియా లాంటి నాయకులు కూడ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications