వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?

మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యావసర సరకులలో వంట నూనెల ధరలు వేగంగా పెరుగుతూ అందరినీ కలవరపెడుతున్నాయి.
గత మే నెలతో పోలిస్తే ప్రభుత్వ లెక్కల్లోనే ఏకంగా 62 శాతం మేర వంట నూనెల ధరలు పెరిగిపోవడం ప్రజలకు భారం అవుతోంది. ఓవైపు కరోనా ప్రభావం, మరోవైపు లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన కుటుంబాలు తీవ్రంగా సతమతమవుతున్నాయి.
అమాంతంగా పెరిగిన ధరల తాకిడిని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. వంట నూనెల పెరుగుదలపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే సమీక్షా సమావేశం కూడా నిర్వహించింది. కానీ, ధరలు మాత్రం అదుపులోకి రాలేదు.
6 నెలల క్రితం 90 రూపాయలుగా ఉన్న పామాయిల్ ఇప్పుడు 150 రూపాయలు దాటిపోయింది. సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా 110 నుంచి 180 రూపాయలకు చేరింది. నల్లొండలో లీటర్ ప్యాకెట్ ఏకంగా 185 రూపాయలుండగా, అమరావతిలో అది 180రూపాయలుంది. దాంతో వంటి ఇంటి బడ్జెట్ తారుమారవుతుందోనే ఆందోళన సామాన్యులతో పాటుగా మధ్యతరగతిలో ఎక్కువగా కనిపిస్తోంది.
ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అనేక కారణాలున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దేశంలో నూనె గింజల ఉత్పత్తి నామమాత్రం దాంతో అత్యధికంగా ఎగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది.

పామాయిల్ అయితే మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ఎక్కువగా దిగమతి అవుతుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ మాత్రం బ్రెజిల్, రష్యా , ఉక్రెయిన్, అర్జంటీనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండడంతో ఆయిల్ ధరల పెరుగుదలకు ఓ కారణంగా చెబుతున్నారు.
పెరుగుతున్న పెట్రో ధరలతో రవాణా ఛార్జీలు, జీఎస్టీ భారం కలిసి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కారణమవుతున్నాయని అంటున్నారు.
దేశంలో 6రకాల వంట నూనెల నెలవారీ ధరలు పరిశీలిస్తే గడిచిన 11 ఏళ్లలోనే అత్యధికంగా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేదంటే తమ బడ్జెట్ తారుమారవుతోందని సామాన్యులు వాపోతున్నారు.
అయితే, దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గిపోయిన తరుణంలో ప్రభుత్వం వాటి సాగు పెంచేందుకు ప్రయత్నిస్తునట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
2020లో 3కోట్ల 30లక్షల మెట్రిక్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరిగితే ఈ ఏడాది అది కేవలం 1కోటి 20లక్షల మెట్రిక టన్నులకు పడిపోయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది వాటి దిగుబడి పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దేశీయ ఉత్పత్తులతో దిగుమతి సుంకాల భారం లేకుండా ధరలను నియంత్రించవచ్చని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications