భారత్ లో కరోనా తాజా పరిస్థితి : గత 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు, 507 మరణాలు
భారతదేశంలో కరోనా వ్యాప్తికి కొనసాగుతుంది. తాజాగా భారతదేశం గత 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు, 507 మరణాలను నమోదు చేసింది. దీంతో ఇప్పుడు దేశం మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,12,57,720గా ఉంది . ఇక తాజాగా నమోదైన 507 మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 4,18,987 కు చేరుకుంది.
ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నవీకరణ ప్రకారం 24 గంటల కాల వ్యవధిలో 38,652 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో రికవరీల మొత్తం 3,04,29,339 కు చేరుకున్నట్లు డేటా చూపించింది. క్రియాశీల కేసులు 4,09,394 వద్ద ఉన్నాయి. బుధవారం 4,07,170 క్రియాశీల కేసులు మాత్రమే ఉండగా ఈరోజు క్రియాశీల కేసుల సంఖ్య పెరిగింది. నిన్న నమోదైన కరోనా మహమ్మారి 42,015 కొత్త కేసులతో గురువారం కేసుల సంఖ్య 632 తక్కువగా ఉంది. గురువారం మరణించిన వారి సంఖ్య బుధవారం కంటే 3,498 తక్కువ, నిన్న మహారాష్ట్ర తన డేటాను సవరించడంతో 3,998 మరణాలు నమోదయ్యాయి.

కోవిడ్ -19 వ్యాధికి ఇప్పటివరకు మొత్తం 45,09,11,712 నమూనాలను పరీక్షించామని, వీటిలో గత 24 గంటల్లో 17,18,439 పరీక్షలు జరిగాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) గురువారం తెలిపింది. దేశవ్యాప్తంగా 415 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను అందించారు. వీటిలో 32,87,16,212 మంది మొదటి వ్యాక్సిన్ మోతాదును తీసుకోగా మిగిలిన 8,67,56,243 మంది రెండు మోతాదులను పొందారు.
కోవిడ్ -19 మహమ్మారి యొక్క రెండవ తరంగంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణాలు సంభవించలేదని చెప్పడంతో పార్లమెంటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ మిత్రపక్షమైన శివసేన వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజ్యసభలో కేంద్ర మంత్రి చేసిన పై ప్రకటనను తీవ్రంగా విమర్శించారు. అయితే ఇది కేంద్రం తయారు చేసిన డేటా కాదు, రాష్ట్రాల నుంచి పంపించిన డేటా ఆధారంగానే చెప్పామని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులపై మాటల యుద్ధానికి దిగింది. ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు సంభవించాయని ఏ రాష్ట్రము తమకు నివేదిక పంపలేదని కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications