Tamil Nadu: 21వరకు , భారీగా సడలింపులు -కొత్తగా 15,759 కొవిడ్ కేసులు, 378 మరణాలు
దేశంలో కరోనా ప్రభావిత టాప్-5 రాష్ట్రాల్లో నాలుగు దక్షిణాదివే కావడం, అత్యధిక కేసుల జాబితాలో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. తొలి నుంచీ కేసులు, మరణాలు భారీగా ఉన్న తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతోన్న లాక్ డౌన్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది.
Recommended Video
ఈనెల 20లోగా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ డేటా బయటికి:కేంద్రం క్లారిటీ,భారత్ బయో భిన్న ప్రకటన
తమిళనాడులో కొనసాగుతున్న లాక్డౌన్ను ఈనెల 21 వరకూ పొడిగిస్తున్నట్లు స్టాలిన్ సర్కారు శుక్రవారం ప్రకటించింది. అయితే లాక్డౌన్ ఆంక్షలను భారీగా సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులకు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను ఎయిర్ కండిషన్లు లేకుండా 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటలకు వరకూ అనుతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. టాక్సీలు, ఆటోలు నడుస్తాయని వెల్లడించింది. అలాగే ప్రభుత్వ పార్కులు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ తెరుస్తారు.
మరోవైపు తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరితో సహా 11 జిల్లాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రొవిజన్ స్టోర్లు, కూరగాయల దుకాణాలు, మాంసం, చేపల దుకాణాలు, పూలమ్ముకునే వారిని అనుమతిస్తామని తాజా ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇకపోతే,
సజ్జల అనూహ్య కామెంట్స్: అమిత్ షాతో జగన్ భేటీ బ్రహ్మాండమా? -రఘురామ, 3రాజధానులు, సీబీఐ కేసులపైనా
తమిళనాడులో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 15,759 వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 378 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆ తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,24,597కు, మొత్తం మరణాల సంఖ్య 28,906కు చేరింది. ప్రస్తుతం 1,74,802 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.