వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Tamil Nadu: 21వరకు , భారీగా సడలింపులు -కొత్తగా 15,759 కొవిడ్ కేసులు, 378 మ‌ర‌ణాలు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా ప్రభావిత టాప్-5 రాష్ట్రాల్లో నాలుగు దక్షిణాదివే కావడం, అత్యధిక కేసుల జాబితాలో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. తొలి నుంచీ కేసులు, మరణాలు భారీగా ఉన్న తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతోన్న లాక్ డౌన్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది.

Recommended Video

Odisha's 5T Vision మిగతా రాష్ట్రాల కంటే ముందు... Naveen Patnaik Action Plan || Oneindia Telugu

ఈనెల 20లోగా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ డేటా బయటికి:కేంద్రం క్లారిటీ,భారత్ బయో భిన్న ప్రకటనఈనెల 20లోగా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ డేటా బయటికి:కేంద్రం క్లారిటీ,భారత్ బయో భిన్న ప్రకటన

తమిళనాడులో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈనెల 21 వరకూ పొడిగిస్తున్నట్లు స్టాలిన్ సర్కారు శుక్రవారం ప్రకటించింది. అయితే లాక్‌డౌన్ ఆంక్షల‌ను భారీగా సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపుల‌కు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను ఎయిర్ కండిషన్లు లేకుండా 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటలకు వరకూ అనుతిస్తామని ప్ర‌భుత్వం పేర్కొంది. టాక్సీలు, ఆటోలు నడుస్తాయ‌ని వెల్ల‌డించింది. అలాగే ప్రభుత్వ పార్కులు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ తెరుస్తారు.

covid:Tamil Nadu extends lockdown till June 21, more relaxations, 15,759 new cases, 378 deaths

మ‌రోవైపు తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరితో సహా 11 జిల్లాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతున్న‌ది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రొవిజన్ స్టోర్లు, కూరగాయల దుకాణాలు, మాంసం, చేపల దుకాణాలు, పూలమ్ముకునే వారిని అనుమ‌తిస్తామ‌ని తాజా ఉత్త‌ర్వుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొంది. ఇకపోతే,

సజ్జల అనూహ్య కామెంట్స్: అమిత్ షాతో జగన్ భేటీ బ్రహ్మాండమా? -రఘురామ, 3రాజధానులు, సీబీఐ కేసులపైనాసజ్జల అనూహ్య కామెంట్స్: అమిత్ షాతో జగన్ భేటీ బ్రహ్మాండమా? -రఘురామ, 3రాజధానులు, సీబీఐ కేసులపైనా

త‌మిళ‌నాడులో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతున్న‌ది. గురువారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు కొత్త‌గా 15,759 వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో మ‌రో 378 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దీంతో ఆ త‌మిళ‌నాడులో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 23,24,597కు, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 28,906కు చేరింది. ప్ర‌స్తుతం 1,74,802 యాక్టివ్ క‌రోనా కేసులు ఉన్న‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

English summary
Tamil Nadu government on Friday extended the Covid-19 lockdown for one more week from June 14 to June 21 but with more relaxations. Tamil Nadu logged 15,759 new COVID-19 cases on Friday, including two returnees from Andhra Pradesh and New Delhi, pushing the tally to 23.24 lakh, while 378 deaths took the toll to 28,906. Recoveries continued to outnumber new infections with 29,243 people being discharged from hospitals, totalling 21,20,889, leaving 1,74,802 active cases, a health department bulletin said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X