వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Covid: భారత్‌కు మరో దెబ్బ -విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం -భారతీయు ప్రయాణికులపైనా ఆంక్షలు

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారికి సంబంధించి రోజువారీ కేసుల్లో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన ఇండియాకు మరో బ్యాడ్ న్యూస్. క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త నేప‌థ్యంలో భార‌త్ నుంచి అన్ని విమానాల‌పై యూనైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిషేధం ప్రకటించింది. మన దేశం నుంచి వెళ్లే అంతర్జాతీయ సర్వీసుల్లో మెజార్టీ విమానాలు యూఏఈలోని దుబాయ్, షార్జా మీదుగా వెళ్లేవే కావడంతో తాజా నిషేధ నిర్ణయం మొత్తం విమానయాన రంగంపై ప్రతికూల ప్రభావం చూపనుంది.

కరోనా విలయం: ఎన్నికలు యథాతథం -కేసీఆర్ సర్కారు పట్టు, ఎస్ఈసీ ప్రకటన -రద్దుకు హైకోర్టు నో చెప్పడంతోకరోనా విలయం: ఎన్నికలు యథాతథం -కేసీఆర్ సర్కారు పట్టు, ఎస్ఈసీ ప్రకటన -రద్దుకు హైకోర్టు నో చెప్పడంతో

భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై ఈ నెల 25 నుంచి ప‌ది రోజుల పాటు, అంటే, మే 5 వరకు నిషేధం విధిస్తున్న‌ట్లు యూఏఈ విమానయాన శాఖ గురువారం ప్ర‌క‌టించింది. ఒక్కవిమానాలపైనే కాదు, భారతీయ ప్రయాణికులపైనా యూఏఈ కఠిన ఆంక్షలు విధించింది. ఇత‌ర దేశాల్లో 14 రోజుల‌పాటు ఉండ‌ని భార‌తీయ ప్ర‌యాణికుల‌ను కూడా (యూఏఈలోకి) అనుమ‌తించ‌బోమ‌ని తెలిపింది. అయితే,

 Covid: UAE to ban all flights from India for 10 days starting April 25

యూఏఈ నుంచి భారత్ కు వచ్చే సర్వీసులు, కార్గో రాక‌పోక‌లు కొన‌సాగుతాయ‌ని, యూఏఈ పౌరులు, దౌత్య అధికారులు, సిబ్బంది, వ్యాపార వేత్త‌ల విమానాల‌కు ఆంక్ష‌ల నుంచి మిన‌హాయింపు ఇచ్చిన‌ట్లు యూఏఈ వెల్ల‌డించింది. అయితే వీరంతా ప‌ది రోజుల‌పాటు త‌ప్ప‌నిస‌రిగా క్వారంటైన్‌లో ఉండాల‌ని, వ‌చ్చిన రోజుతోపాటు, త‌ర్వాత 4, 8 రోజుల్లో పీసీఆర్ ప‌రీక్ష చేయించుకోవాల‌ని పేర్కొంది. ఈ కేట‌గిరి వ్య‌క్తుల ప్ర‌యాణాల‌కు ముందుగా చేయించుకున్న క‌రోనా ప‌రీక్ష గ‌డువును 72 గంట‌ల నుంచి 48 గంట‌ల‌కు కుదించింది. కేవ‌లం అనుమ‌తించిన ల్యాబ్ రిపోర్టుల‌ను మాత్ర‌మే అంగీక‌రిస్తామ‌ని ప్ర‌క‌టించింది. మరోవైపు..

కరోనా విలయం: సుప్రీం సంచలనం -దేశంలో ఎమర్జెన్సీ -మోదీ సర్కారుకు ప్రణాళిక ఉందా? పూర్తి లాక్‌డౌన్?కరోనా విలయం: సుప్రీం సంచలనం -దేశంలో ఎమర్జెన్సీ -మోదీ సర్కారుకు ప్రణాళిక ఉందా? పూర్తి లాక్‌డౌన్?

భారత్ నుంచి అదనపు విమానాల రాకపోకలకు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నిరాకరించింది. గురువారం ఇండియా నుంచి వచ్చే 8 అదనపు ప్రత్యేక విమానాల ల్యాండింగ్‌కు అనుమతించాల్సిందిగా నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి వచ్చిన అభ్యర్థనను తిరస్కరించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్ రేపటి (శుక్రవారం) నుంచి 'రెడ్‌లిస్ట్' ట్రావెల్ బ్యాన్‌ను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత విమానాలకు అనుమతి నిరాకరించింది. ఒత్తిళ్లు తీవ్రతరం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అదనపు విమానాల కోసం వచ్చిన అభ్యర్థనను తిరస్కరించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. కాగా,

ఇండియాలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,14,835 కొత్త కేసులు, 2,104 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక దేశంలో నమోదైన రోజువారీ అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. భారత్ లో మే నెల మూడో వారం దాకా వైరస్ ఉధృతి కొనసాగొచ్చన్న అంచనాల నేపథ్యంలో తొలుత బ్రిటన్, తర్వాత హాంకాంగ్, ఇప్పుడు యూఏఈ విమానాల రాకపై నిషేధం విధించాయి.

English summary
The United Arab Emirates (UAE) announced on Thursday that it will stop all its flights from India for a period of 10 days starting April 25 (Sunday) due to the massive rise in India’s caseload of the coronavirus disease (Covid-19). The UAE is known to be the busiest route for all international flights from India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X