బెంచ్ మార్క్ సెట్ చేసిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్
ముంబై వేదికగా గత ఏడాది జూలైలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రపంచ దేశాలు.. భారత్ వైపు చూసేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఓ సాంస్కృతిక ఘట్టం కావడమే దీనికి ప్రధాన కారణం.
ఈ వేడుకకు హాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, టెక్ దిగ్గజాలు, క్రీడా ప్రముఖులు హాజరై, భారతీయ ఆచారాలు, దుస్తులను ఎంతో గౌరవంగా స్వీకరించారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, జాన్ సెనా, కిమ్ కార్దాషియన్ వంటి ప్రముఖులు భారతీయ వస్త్రధారణలో, మన సంప్రదాయాలకు తగ్గట్టుగా వేడుకల్లో పాలుపంచుకోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

వారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు, హిందీ క్యాప్షన్లు, భారతీయ సంప్రదాయాల ప్రస్తావనలతో వైరల్ అయ్యాయి. ఇది భారతదేశ గొప్ప వారసత్వానికి ప్రపంచవ్యాప్త గుర్తింపునిచ్చింది. వోగ్, న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్, బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు పెళ్లి ఆడంబరం కోసం కాకుండా, వేడుకలో ఇమిడిఉన్న సంస్కృతిని భారతీయ సంప్రదాయాలను లోతుగా కవర్ చేశాయి.
అనంత్ రాధికా మర్చంట్ల వివాహం కోసం ప్రపంచం భారత్కు తరలివచ్చింది.మన సంప్రదాయాలు, సంస్కృతి కేవలం భారత్కే పరిమితం కాకుండా ప్రపంచ వేదికలపై కూడా ఉండాలన్న లక్ష్యాన్ని ఈ వివాహం చాటింది. వివిధ సంస్కృతులకు చెందిన ప్రముఖులు భారతీయ సంప్రదాయాలైన హల్దీ, సంగీత్, ఇతర వివాహ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని సంబరపడ్డారు.
అంబానీ కుటుంబం ఈ సందర్భంగా భారత సంస్కృతిని, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే రాయబారులు పాత్రను పోషించింది. సాంప్రదాయ దుస్తుల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు, దేవతల ముందు తలవంచి, నవ దంపతులను ఆశీర్వదించిన దృశ్యాలు ఈ పెళ్లి కేవలం వ్యక్తిగతం కాదని, అది ప్రపంచం మరిచిపోలేని ఓ సాంస్కృతిక ఘట్టమని చాటాయి.
అనంత్-రాధికల వివాహం ప్రపంచాన్ని ఏకం చేసిన ఓ సాంస్కృతిక మైలురాయి. ఇది మన మూలాలకు కట్టుబడి ఉండటంలోనే అసలైన ఫ్యాషన్, అందం, అర్థం ఉన్నాయని ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ పెళ్లి జరిగి ఏడాది అవుతున్నా, ప్రజలు గుర్తుంచుకుంది దాని గొప్పతనాన్ని కాదు, అందులోని ఆత్మీయతను, పవిత్రతను, ప్రపంచం మన భారతీయ లయకు అనుగుణంగా ఎలా నృత్యం చేసిందో అనే విషయాన్ని కూడా.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications