సిడబ్ల్యూసి సభ్యుల రిజైన్? ప్రతిపక్ష నేతగా రాహుల్ నో
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ మూకుమ్మడి రాజీనామా చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సిడబ్ల్యూసి, ఏఐసిసి భేటీ కానుంది. ఈ భేటీలో సిడబ్ల్యూసి సభ్యులు తమ రాజీనామాలను సమర్పించే అవకాశం ఉందంటున్నారు.
ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై నేతలు సమీక్షించనున్నారు. ఎన్నికల్లో ఓటమికి సమిష్టి బాధ్యత వహించే దిశగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

ఓటమికి గల కారణాల పైన వారు చర్చించనున్నారు. రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించిన వారందరి పైనా వేటు వేయనున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ కేవలం 44 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
మరోవైపు కాంగ్రెస్ ఘోర వైఫల్యం, బిజెపి అనూహ్య విజయం నేపథ్యంలో లోకసభలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత రేసులో కమల్ నాథ్ ముందంజలో ఉన్నారని సమాచారం.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications