మరో అమానుషం : 'దళిత మహిళతో మూత్రం తాగించి..'
దర్భాంగా : దేశంలో దళితులపై దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గతకొద్ది రోజులుగా తరుచూ వార్తల్లో వినిపిస్తున్న ఈ అంశానికి మరో మరో ఘటన తోడైంది. అత్యంత అమానుషంగా ఓ దళిత మహిళ చేత మూత్రం తాగించిన ఘటన బీహార్ లోని దర్భాంగా జిల్లా పిప్రాలో చోటు చేసుకుంది.
ఊళ్లో చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడడానికి మంత్రాలు చేతబడులే కారణమని.. ఆ మంత్రాలు చేతబడులు ఓ దళిత మహిళే చేస్తుందన్న కారణంతో గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆమెను తీవ్రంగా కొట్టి.. ఆపై ఆమెతో మూత్రం తాగించారు.

కాగా, విషయం తెలుసుకున్న దర్భాంగ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అంజని కుమార్.. దర్యాప్తు కోసం గ్రామానికి వెళ్లగా.. తీవ్రంగా గాయపడ్డ సదరు బాధితురాలు ఊరినే విడిచి వెళ్లిపోయినట్లు తెలసిందని చెప్పారు. ఇప్పటికే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడుల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోన్న క్రమంలో మరో అమానుష ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications