జయలలిత మేనకోడలు దీపా ధీమా: అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం మాదే, శశికళకు కాదు!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం తనకే దక్కుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ను తాము సంప్రధించామని దీపా అన్నారు.
జయలలిత స్పృహలోని స్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లారు: షుగర్ లెవెల్స్ 508, కుట్ర జరిగిందా!
శుక్రవారం జయలలిత మేనకోడలు దీపా చెన్నైలో మీడియాతో మాట్లాడారు. జయలలితకు వారసులు మేమేనని, అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం మాకే రావావలని దీపా అంటున్నారు. జయలలిత ఆశయాలు కాపాడే సత్తా మాకే ఉందని దీపా ధీమా వ్యక్తం చేశారు.
శశికళ, టీటీవీ దినకరన్ కుటుంబ సభ్యులు మమ్మల్ని మా మేనత్త జయలలితకు దూరం చేశారని దీపా ఆరోపించారు. చిన్నతనంలో మేము పోయెస్ గార్డెన్ లోనే ఉన్నామని, తరువాత శశికళ కుటుంబ సభ్యుల కారణంగా మేము జయలలితకు దూరం అయ్యామని దీపా ఆరోపించారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి తాము ఇప్పటికే ఎన్నికల కమిషన్ ను సంప్రధించామని, మరోసారి అధికారులను సంప్రధిస్తామని దీపా జయకుమార్ చెప్పారు. శశికళ కుటుంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీకి దూరం చెయ్యడమే మా లక్షం అని దీపా వివరించారు.