ఢిల్లీ పేలుళ్లలో 13కి చేరిన మృతుల సంఖ్య..రంగంలోకి అమిత్ షా
దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన భయంకరమైన కారు పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలను, దర్యాప్తు వేగాన్ని సమీక్షిస్తూ ఆయన కీలక ప్రకటన చేశారు.
సోమవారం సాయంత్రం 6:55 గంటలకు ఎర్రకోట సమీపంలో హోండా ఐ20 (Honda i20) కారులో ఈ పేలుడు సంభవించినట్లు హోంమంత్రి అమిత్ షా ధృవీకరించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్తో సహా ఉన్నతాధికారులందరితో ఆయన ఫోన్లో మాట్లాడారు, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా, పేలుడుకు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. కాసేపట్లో ఆయన స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.
ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 13కి చేరుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమవ్వడంతో, ఆ దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. ఈ దాడిలో 30 మంది గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఎల్ఎన్జేపీ (LNJP) ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అంతకుముందే ఆసుపత్రికి వెళ్లిన అమిత్ షా, క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు మరియు ఆధారాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పేలుడు వెనుక కారణాలు, ఉగ్రవాద కోణం ఉందా అనే దిశగా స్పెషల్ సెల్, NIA, NSG బృందాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications