lockdown:పనిచేయని ఫ్యాన్లు, నాణ్యతలేని భోజనం, దోమల స్వైర విహారం, వసతి గృహాల్లో కూలీల వెతలు...
లాక్డౌన్ వల్ల ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో సౌకర్యాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కనీస వసతులు లేకపోకవడంతో అక్కడున్న వారు నరక అనుభవిస్తోన్నారు. ఢిల్లీలోని మంజు కా టిల్లా, పొష్ సివిల్ లైన్స్లో గల రెండు వసతి గృహాలను పోలీసు అధికారులు సందర్శించారు. అక్కడి పరిస్థితులపై పరిశీలించే క్రమంలో సంచలన నిజాలు వెలుచూశాయి.

ఫ్యాన్లు ఉన్నా...
ఆ రెండు వసతి గృహాల్లో ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదు. అసలే వేసవి కాలం.. ఉక్కపోయకుండా కనీస అవసరం ఫ్యాన్.. కానీ అదీ కూడా లేకుండా గడపాల్సి వస్తోంది. అక్కడున్న వారు ఉపయోగించి టాయిలెట్లను క్లీన్ చేయడం లేదు. ఎక్కువమంది ఉండటంతో దుర్గందం వెదజల్లుతోంది. అంతేకాదు ఆహారం కూడా నాణ్యత లేనిది పెడుతున్నారని చెబుతూ వలసకూలీలు వాపోయారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్ కాదు కదా.. హ్యాండ్ వాష్ కూడా లేదు. టాయిలెట్లలో ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే నీరు వస్తోందని.. తర్వాత రావడం లేదని వాపోయారు.

ఒకే సబ్బు..
స్నానం చేసేందుకు అందరికీ ఒకే సబ్బు ఇస్తున్నారని.. బట్టలు పిండేందుకు సబ్బులు లేవని పేర్కొన్నారు. ఇక రాత్రిపూట తమపై దొమలు దండయాత్ర చేస్తున్నాయని వెల్లడించారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే.. వసతి గృహ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించారని వలసకూలీలు పోలీసు అధికారులకు వివరించారు. దీంతో తాము చూసిన అంశాలను దక్షిణ డీసీపీ మోనిక భరద్వాజ్.. సెంట్రల్ కమిషనర్ నిధి శ్రీవాత్సవకు అందజేశారు. ఇలాంటి పరిస్థితులే మరో 15 వసతి గృహాల్లో ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా పరిపాలానా యంత్రాంగం దృష్టికి నిధి శ్రీవాత్సవ తీసుకెళ్లారు.

మంచినీరు కూడా లేదు
వసతి గృహాల్లో సమస్యలు తమ దృష్టికి రావడంతో.. వెంటనే నివేదిక రూపంలో అందించాలని ఆయా పోలీసు అధికారులను కోరామని.. వారు నివేదించి తమ పరిధిలో గల రెవెన్యూ సిబ్బందికి జాబితా అందజేశారని తెలిపారు. వారు జిల్లా కలెక్టర్కు నివేదిక పంపడంతో.. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే మేజిస్ట్రేట్ ఆయా రెవెన్యూ అధికారులతో మాట్లాడి.. సమస్య పరిష్కారం దృష్టిసారించాలని ఆదేశించారని పేర్కొన్నారు. లాహొరి గేట్ పోలీసు స్టేషన్ ఏరియాలో ఉన్న వసతి గృహంలో కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవని నివేదించడం ఆందోళన కలిగిస్తోంది.

నాణ్యత లేని ఆహారం..
వసతి గృహల్లో రోజుకు రెండుసార్లు భోజనం పెడుతున్నారని.. కానీ నాణ్యత లేదని పేర్కొన్నారు. దీంతో మంచి ఆహారం వలసకూలీలు తిరిగే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఆయా గృహాలో బెడ్లు దగ్గరగా ఉన్నాయని.. సోషల్ డిస్టన్స్ పాటించలేదని అంశం ఆందోళనకు గురిచేస్తోంది. లాక్ డౌన్ విధించడంతో ఇళ్లులేని వారిని కూడా వసతి కేంద్రాల్లోకి తీసుకెళ్లారని.. దీంతో సమస్య వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అక్కడ జనం పెరగడంతో మౌలిక వసతుల సదుపాయాల కల్పన కష్టంగా మారుతోందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
Recommended Video
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications