మహిళా జడ్జీ వెంటపడిన దొంగలు.. అదును చూసి..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తినే వెంబడించారు. ఆమె కారు అద్దాలు పగలగొట్టి ఆమె పర్సు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని సాకేత్ కోర్టు అదనపు న్యాయమూర్తి గత మంగళవారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు.

అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఆమె కారును వెంబడించారు. సరితా విహార్ అండర్ పాస్ సమీపంలోకి రాగానే.. కారు వెనుక భాగం విరిగిపోయిందని ఆ దుండగులు ఆమెకు సైగలు చేశారు. అయితే, ఆమె వారి మాటలు నమ్మకుండా డ్రైవింగ్ కొనసాగించారు.
ఓఖ్లా ప్రాంతంలో ఆమె కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగానే.. వెనుకే వస్తున్న దొంగలు ఆమె కారు అద్దాలు పగలగొట్టి.. ఆమె పర్స్ ఎత్తుకెళ్లారు. ఈ పరిణామంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి.. కళ్లముందే చోరీ జరుగుతున్నా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు.
ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా, దేశ రాజధానిలో ఓ మహిళా న్యాయమూర్తి పరిస్థితే ఇలావుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications